French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడం లేదని భర్తపై భార్య ఫిర్యాదు.. గృహ హింస కేసు నమోదు
- తనను భర్త ఫ్రెంచ్ ఫ్రైస్ తిననీయడం లేదన్న కారణం భర్తపై ఫిర్యాదు
- గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
- అవాక్కైన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. తనను భర్త ఫ్రెంచ్ ఫ్రైస్ తిననీయడం లేదన్న కారణంతోనే భార్య భర్తపై స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో ఏం చేయాలో తోచక భర్త కోర్టుకు వెళ్లాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అవాక్కైంది. వివరాల్లోకి వెళితే…
READ MORE: Illegal affair: భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకున్న భార్య.. తర్వాత ఏమైందంటే..?
Also Read
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
కర్ణాటకకు చెందిన దంపతులకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల పాటు అమెరికాలో ఉన్న ఈ జంట.. గతేడాది భారత్కు వచ్చారు. ఇటీవలే ఓ బిడ్డకు భార్య జన్మనివ్వడంతో ఆరోగ్యం దృష్యా బంగాళాదుంపలతో చేసిన ఫ్రెంచ్ ప్రైస్ వంటివి తినొద్దని మంచి ఆహారం తీసుకోవాలని సదరు భర్త సూచించారు. అయితే, ఇది భార్యకు నచ్చలేదు. తనను వేధిస్తున్నాడని, మాంసాహారానికి దూరంగా ఉండమంటాడని, ఏం తినాలో వద్దో ఆయనే చెబుతున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాధితుడు, అతడి తల్లిదండ్రులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడు హైకోర్టును ఆశ్రయించి.. తనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాడు. అతడి పిటిషన్పై జస్టిస్ నాగప్రసన్న విచారణ చేపట్టారు. ఆమె ఆరోపణలు
సహేతుకంగా లేకపోవడంతో బాధితుడికి ఊరట కల్పించారు.
READ MORE: Reliance Jio: జియో పేరుతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!
కాన్పు అనంతరం పౌష్టికాహారం, పండ్లు, పాలు తీసుకోమని చెబితే కేసు పెట్టిందని భర్త లబోదిబోమన్నాడు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తినొద్దని వారిస్తే ఎదురు కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. శుక్రవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. భార్య కేసు పెట్టిన కారణం తెలిసి అవాక్కయ్యారు. ‘భర్తకు వ్యతిరేకంగా ఏదైనా విచారణను అనుమతించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడం.. సంబంధిత సమయంలో ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి అనుమతి ఇవ్వలేదన్న భార్య ఆరోపణల సమంజం కాదు… అందువల్ల, భర్తపై అన్ని విచారణలను తాత్కాలికంగా నిలిపివేయాలి’ అని ఆదేశించారు. అంతేకాదు, ఉద్యోగ పనిమీద అతడు అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది.
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..