November 1st Rules Change: నవంబర్ నెలలో మార్పులు కానున్న పలు నిబంధనలు ఇవే
- నవంబర్ నెలలో పలు నిబంధనలు మార్పులు.
- రైలు టిక్కెట్ రిజర్వేషన్ లో మార్పు
- మనీ ట్రాన్స్ఫర్ రూల్స్
- క్రెడిట్ కార్డ్ నియమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
November 1st Rules Change: ప్రతి నెలలాగే వచ్చే నవంబర్ నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. క్రెడిట్ కార్డ్, ఎల్పిజి గ్యాస్, రైలు టిక్కెట్ల నుండి ఫిక్సెడ్ డిపాజిట్ గడువు వరకు నియమాలు నవంబర్ 1 నుండి మారుతాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రభావం చూపనుంది. వచ్చే నెల నుండి ఏ నియమాలు మారుతున్నాయో.. అవి మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దాం.
ఎల్పిజి సిలిండర్ ధరలు :
Also Read
ప్రతి నెల మొదటి తేదీన, పెట్రోలియం కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తాయి. ఇందులో భాగంగా కొత్త రేట్లను విడుదల చేస్తాయి. ఈసారి కూడా దీని ధరలు నవంబర్ 1వ తేదీన మారుతాయి. చాలా కాలంగా నిలకడగా ఉన్న 14 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలు ఈసారి మరింత తగ్గుముఖం పడతాయని ప్రజలు భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర గురించి చూస్తే.. జూలై నెలలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింది. అయితే, ఆ తర్వాత వరుసగా మూడు నెలలు పెరుగుతూ వచ్చింది.
ATF, CNG – PNG ధరలు:
చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా 1వ తేదీన సవరిస్తాయన్న విషయం, తెలిసిందే. దీనితో పాటు CNG-PNG, ఎయిర్ టర్బైన్ ఇంధనం ( ATF) ధరలు కూడా మారుతాయి. గత కొన్ని నెలలుగా వాయు ఇంధనం ధరలో తగ్గుదల ఉంది. ఈసారి కూడా ధరలను తగ్గించి పండుగ కానుకగా భావిస్తున్నారు. ఇది కాకుండా, CNG – PNG ధరలలో కూడా పెద్ద మార్పును చూడవచ్చని అంచనా వేస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ నియమాలు:
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 1 నుండి దేశంలో అమల్లోకి రానున్న మార్పు గురించి మాట్లాడుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సంస్థ SBI కార్డ్ తన క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించిన పెద్ద మార్పులను నవంబర్ 1 నుండి అమలు చేయబోతోంది. నవంబర్ 1 నుండి అసురక్షిత SBI క్రెడిట్ కార్డ్లపై ప్రతి నెలా రూ. 3.75 ఫైనాన్స్ ఛార్జీలు చెల్లించాలి. ఇది కాకుండా.. విద్యుత్, నీరు, ఎల్పిజి గ్యాస్, ఇతర యుటిలిటీ సేవలకు రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపుపై 1 శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది.
మనీ ట్రాన్స్ఫర్ రూల్స్:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ (DMT) కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇది నవంబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిబంధనల ఉద్దేశ్యం మోసం కోసం బ్యాంకింగ్ ఛానెల్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం.
రైలు టిక్కెట్ రిజర్వేషన్ లో మార్పు:
భారతీయ రైల్వే రైలు టిక్కెట్ ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) ప్రయాణ రోజును నవంబర్ 1, 2024 నుండి 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించబడుతుంది. టికెట్ కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రయాణీకుల సౌకర్యాన్ని కొనసాగించడం ఈ సవరణ ముఖ్య లక్ష్యం.
బ్యాంకు సెలవులు:
పండుగలు, ప్రభుత్వ సెలవులు అలాగే అసెంబ్లీ ఎన్నికల కారణంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రోజులను చూస్తే.. మొత్తంగా 13 రోజుల పాటు బ్యాంకుల్లో పని ఉండదు. నవంబర్లో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ బ్యాంక్ సెలవుల సమయంలో, మీరు బ్యాంకుల ఆన్లైన్ సేవలను ఉపయోగించి మీ బ్యాంకింగ్ సంబంధిత పని, లావాదేవీలను పూర్తి చేయవచ్చు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!