TS EAMCET : ముగిసిన ఎంసెట్ పరీక్షలు.. ఈ నెల చివర్లో ఫలితాలు.. నేడు ప్రైమరీ కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS EAMCET : ఐదురోజుల పాటు సజావుగా సాగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షలకు 94.11 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.
Read Also:Akkineni: నాగార్జునకు అలా… నాగ చైతన్యకు ఇలా!
Also Read
పరీక్షల ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేశారు. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకణ, ఫైనల్ కీ విడుదల, నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు.
Read Also:CBI Director: సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను సోమవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కోకన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి https://eamcet. tsche.ac. in వెబ్సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రాథమిక కీపై ఈ నెల 17న రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?