NTV Telugu Site icon

Lee Hsien Loong: ఐఐటీ, ఐఐఎంను మెచ్చుకున్న సింగపూర్ ప్రధాని

Singapure

Singapure

సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతీయ ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ లోని ఐఐటీ(IIT), ఐఐఎం(IIM)ని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలం గురించి చర్చించారు. సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతోందని పీఎం లీ సీన్ లూంగ్ అన్నారు. ఇది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్‌లను కలిగి ఉందన్నారు. ఆయన మే 15న తన పదవిని వదులుకోనున్నారు. తన డిప్యూటీ లారెన్స్ వాంగ్‌కు పగ్గాలు అప్పగించే ముందు లీ విస్తృత ఇంటర్వ్యూలో తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలాన్ని వివరించారు.

READ MORE: Arunachal Pradesh: అంతరాష్ట్ర వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. నలుగురు మైనర్లు సేఫ్

IIT-IIMని స్టాన్‌ఫోర్డ్-హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చారు. అవి భారతదేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లని, వాటిలో స్థానం సంపాదించడం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందడంతో సమానమని చెప్పారు. అక్కడి ప్రొఫెషనల్స్ సింగపూర్‌లో అసోసియేషన్లు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు ఫంక్షన్‌లు నిర్వహిస్తున్నారన్నారు. భారత్ కి చెందిన కార్మికుల సంఘం గురించి ప్రస్తావిస్తూ.. సింగపూర్ వాసులు భారత్ కార్మికుల రాకపై శ్రద్ధ చూపుతున్నారన్నారు. సింగ‌పూర్ సిబ్బందికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా విదేశీ టాలెంట్‌లను తీసుకురావడాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం శోధిస్తుందని.. చైనా, భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక ఇతర ఆగ్నేయాసియా దేశాలు, ముఖ్యంగా పొరుగున ఉన్న మలేషియా, ప్రధాన వనరులని స్పష్టం చేశారు.