Master Plan: మాస్టర్ ప్లాన్ ఉద్యమం ఉధృతం.. భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన జేఏసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Master Plan: కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాని డిమాండ్ చేస్తూ.. రైతులు ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి మున్సిపల్ పాలక వర్గం తమ పదవులకు రాజీనామా చేయాలని డెడ్ లైన్ పెట్టారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల విజ్ఞప్తికి.. బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్ల పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నెల 20న గంప ఇళ్లు ముట్టడించాలని రైతు జేఏసీ అత్యవసర సమావేశంలో తీర్మాణించారు. ఇండస్ట్రీయల్ జోన్ లో తన భూమి పోతుందని ఆవేదనతో.. మరో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం ఉద్రిక్తతకు దారితీస్తోంది.
Read Also: Sabitha Indra Reddy: బదిలీల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగవద్దు
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
మాస్టర్ ప్లాన్ పై పాత రాజం పేటలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 9 విలీన గ్రామాల రైతులు పాల్గొన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యచరణ పై చర్చించిన రైతులు… ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈనెల 19 తేదీ వరకు మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ లో తీర్మానం చేయాలని ఈ మేరకు.. పాలకవర్గం పై ఒత్తిడి చేసేలా కార్యాచరణ రూపొందించారు. విలీన గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా.. బీజేపీ 2వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి, 11వ వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను రైతు జేఏసీకి అందజేశారు. అధికార పార్టీకి చెందిన మిగతా కౌన్సిలర్లు తమ పదవులకు 19తేదీ లోపు రాజీనామా చేయాలని లేని పక్షంలో 20న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు రైతులు.
Read Also: Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు
మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా.. 45 రోజులుగా ఉద్యమం చేస్తున్న విలీన గ్రామాల రైతులు.. మున్సిపల్ పాలక వర్గం రాజీనామాలే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. రైతుల గుంట భూమి కూడా నష్టం కలిగించే ప్రసక్తే లేదనీ చెప్తున్న కలెక్టర్, కమిషనర్, MLA లు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 19 వ తేదీన మున్సిపల్ సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి.. మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో.. అధికార పార్టీ కౌన్సిలర్లు అయోమయంలో పడ్డారు. మాస్టర్ ప్లాన్ తన భూమి పోతుందని ఆవేదనతో.. రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన మర్రి బాలకృష్ణ విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. బాధితున్ని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు. నేడు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన రైతులు.. 19న కౌన్సిలర్ల రాజీనామాకు ఒత్తిడి తేవాలని, 20న ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడిస్తామని స్పష్టం చేశారు. 20 నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేసేలా కార్యచరణ ఉంటుందని సంకేతాలిచ్చారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో.. అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!