MS Dhoni IPL Retirement: రిటైర్మెంట్పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
- నాకు ఇంకా 4-5 నెలల సమయం ఉంది
- బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా
- రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం, తిరిగి వస్తున్నానని చెప్పడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్ ఇస్తున్నాడని, ఐపీఎల్లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం లేదని, అలాగని వచ్చే ఏడాది ఆడుతానని కూడా చెప్పడం లేదని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా 4-5 నెలల సమయం ఉంది. ఇప్పటికిప్పుడు తొందరేమీ లేదు. ప్రతి సంవత్సరం శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తోంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్ కాబట్టి ఫిట్నెస్ ఉత్తమంగా ఉండాలి. క్రికెటర్లు పెర్ఫామెన్స్ కారణంగా రిటైర్ కావాల్సి వస్తే.. కొందరు 22 సంవత్సరాల వయస్సులో రిటైర్ అవుతారు. ఇక్కడ మీరు ఎంత పరుగుల దాహంతో ఉన్నారు, ఎంత ఫిట్గా ఉన్నారో ముఖ్యం. మీరు జట్టుకు ఎంత సహకరించగలరు, జట్టుకు మీరు అవసరమా అనేది కూడా ముఖ్యమే. నాకు తగినంత సమయం ఉంది. కొంతకాలంగా ఇంటికి వెళ్లలేదు, రాంచీకి తిరిగి వెళ్తాను. నేను కొన్ని బైక్ రైడ్లను ఆస్వాదిస్తాను. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాను. నేను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం, అదే సమయంలో తిరిగి వస్తున్నానని చెప్పడం లేదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పాడు.
Also Read
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
ఐపీఎల్ 2025ని చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ను 83 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. లీగ్ చివరి మ్యాచ్లో చెన్నై ముందుగా 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (52; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీ బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!