education: ట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్ 1 కు ఇప్పటికే విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటె వాటిని సరిదిద్దుకోవడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)మెయిన్స్ 2024 సెషన్ 1 అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది. ఈ నేపథ్యంలో అప్లికేషన్లలో మార్పులు చేసుకోవాలనుకునే విద్యార్థులు jeemain.nta.ac.inకి లాగిన్ చేసి అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. కాగా ఈ కరెక్షన్ విండో డిసెంబర్ 8వ తేదీ రాత్రి 11:50. గంటల వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది.
Read also:Nani : యానిమల్ కంటే మ్యాడ్ నెస్ పాత్రలు చేస్తాను..
కనుక ఎవరైతే దరఖాస్తులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగినిన్చుకుని రేపటి లోపు దరఖాస్తులో తప్పులు ఉంటె సరిదిద్దుకోవాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరింది. కాగా ఈ అవకాశం డిసెంబర్ 8 వ తేదీ రాత్రి 11:50. గంటల వరకే ఉంటుందని.. ఆ తరువాత ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అదనపు ఫీజు ఏదైనా చెల్లించాల్సి వస్తే ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ల ద్వారా చేసుకోవచ్చని వివరించింది. కాగా JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష 2024 లో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఈ పరీక్ష IIT JEE అడ్వాన్స్డ్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తుంది.