UP: కన్న తల్లినే చంపేసిన కొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
- ఉత్తరప్రదేశ్లో హృదయ విదారకర ఘటన
- తల్లిని క్రూరంగా చంపేసిన కుమారుడు
- వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్న కుమారుడే తల్లిని క్రూరంగా చంపేశాడు. కాన్పూర్లోని రావత్పూర్లో 12వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాటలు వినకుండా ఆపినందుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింది భాగంలో దాచి పెట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కొడుకు ఈ విషయాన్ని గ్రహించాడు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.
READ MORE: Drugs Case : డ్రగ్స్ కేసులో తెలుగు నటులతో సంబంధమున్న తమిళ నటుడు అరెస్ట్
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్లోని రావత్పూర్ ప్రాంతంలో ఊర్మిళ రాజ్పుత్ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇద్దరు పిల్లలు ఆమెతోనే ఉంటున్నారు. సమాచారం ప్రకారం.. ఊర్మిళ తన మొదటి భర్తతో ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఆ కుమారుడు12వ తరగతి చదువుతున్నాడు. రెండవ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం, పెద్ద కొడుకు ఇంట్లో ఉండగా చిన్న కొడుకు పాఠశాలకు వెళ్లాడు. తల్లి పెద్ద కొడుకును పాత్రలు కడగమని చెప్పి, బీపీ మందు వేసుకుని నిద్రపోయింది ఊర్మిళ. పెద్ద కొడుకు పాటలు పెట్టుకుని సౌండ్ బాగా పెంచాడు. సౌండ్ తగ్గించాలని ఆమె కొడకుకు చెప్పింది. మాట వినకపోవడంతో ఊర్మిళ స్పీకర్ను పగలగొట్టింది. ఆ బాలుడు కోపంతో తన తల్లిని తోసేశాడు. దీంతో ఆమె ముక్కు పగిలిపోయి రక్తం వచ్చింది.. ఈ విషయాన్ని తన తల్లి అందరికీ చెబుతుందేమోనని భయపడిన పెద్ద కొడుకు దుప్పట్టాను తల్లి గొంతుకు బిగించి, మృతదేహాన్ని మంచం లోపల దాచాడు.
READ MORE: Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటనలో రాజకీయ కుట్ర కోణం..!
చిన్న కొడుకు పాఠశాల నుంచి తిరిగి వచ్చి తన తల్లి కోసం వెతికాడు. అమ్మ ఎక్కడ అని తన అన్నయ్యను అడిగాడు. అతను సమాధానం చెప్పలేదు. చాలా సేపు వెతికిన చిన్న కొడుకు మంచం పై భాగాన్ని తెరిచి చూశాడు. అందులో తల్లి మృతదేహం కనిపించింది. పెద్దగా అరవడంతో చుట్టు పక్కల జనాలు అక్కడికి చేరుకున్నారు. ఇంకా ఊపరి ఆడుతోందని భావించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఏసీపీ రంజిత్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. తన తల్లిని తానే చంపినట్లు పెద్ద కొడుకు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. కానీ.. ఈ మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయని ఊర్మిళ సోదరీమణులు చెబుతున్నారు. ఊర్మిళ బరువు దాదాపు 90 కిలోలు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆమెను ఎత్తుకుని మంచం లోపల ఎలా దాచి పెడతాడు? అని అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
-
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.1 కోటి విరాళం
-
KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!