మీర్జాపూర్.. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ క్రేజీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రియులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. గత మూడు సీజన్లుగా ఓటీటీలో రికార్డులు సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్గా రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘మిర్జాపూర్: ది ఫిల్మ్’ వచ్చే ఏడాది సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు మాజీ అల్లుడితో మమ్ముట్టి
ఆ రోజున కృష్ణాష్టమి కావడం వీకండ్ అడ్వాంటేజ్ హాలిడేస్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డూ పండిట్) తో పాటు ఈ సిరీస్ స్టార్ మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు శర్మ మళ్ళీ కనిపించబోతున్నారు. పునీత్ కృష్ణ స్క్రిప్ట్ అందించగా, గుర్మీత్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓటీటీ వెర్షన్ కంటే వంద రెట్లు ఎక్కువ యాక్షన్, డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ తెలిపారు. సిరీస్లోని పాత పాత్రలతో పాటు, సినిమాలో జితేంద్ర కుమార్ (పంచాయతీ ఫేమ్), రవి కిషన్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమాను మళ్ళి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఓటీటీలో అదరగొట్టిన మీర్జాపూర్ ఇప్పడు సినిమాగా థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.