Body Guard : బాడీని సేవ్ చేయమంటే.. బాడీనే లేకుండా చేసిన బాడీగార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Body Guard : ఎంత మనకింద పని చేసేవాళ్లనైనా చులకనగా చూడకూడదు. వాళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. వాళ్లకు ప్రతినెల జీతం ఇవ్వకుంటూ వాళ్లు ఇబ్బందులు పడతారు. చాలా కాలం పాటు జీతం ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. యజమాని ఎంతటివాడైనా నిలదీయడం సహజం. అలాంటి ఘటనే ఉగాండాలో మంగళవారం చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ నిలదీయడాలు లేవు. ఏకంగా తుపాకీ పెట్టి కాల్చేశాడు. చాలా కాలం నుంచి జీతం ఇవ్వడం లేదని ఓ మంత్రిని అతడి బాడీగార్డే కాల్చి చంపాడు.
Read Also: Auto workers: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా.. మద్దతుగా భట్టివిక్రమార్క
Also Read
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
- CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
- Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
- CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
సైన్యం, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్య ఓ ప్రైవేట్ వివాదంలో జరిగింది. బాధితుడు చార్లెస్ ఎంగోలా రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన ప్రెసిడెంట్ యోవేరి ముసెవేని ప్రభుత్వంలో కార్మిక శాఖకు జూనియర్ మంత్రిగా పనిచేస్తున్నాడు. మంత్రి ఉగాండా రాజధాని కంపాలా శివారులోని ఎంగోలాలోని తన ఇంటిలో ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కానీ.. గార్డుకు మంత్రికి వేతనాలపై గొడవ జరుగుతుందని స్థానిక ప్రెస్ నోట్ పేర్కొంది.
Read Also:Tamilnadu : తమిళనాడులో దారుణం.. ఐదుగురు చిన్నారులపై గ్యాంగ్ రేప్
ఒక మంత్రిగా ఉండి కూడా తనకు చాలా కాలంగా జీతాలు ఇవ్వలేదని బాడీ గార్డు ఆందోళన చెందుతున్నట్లు, అందుకే అతడు కాల్పులకు ఒడిగట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా.. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో జరిగిన తుపాకీ దాడుల్లో ఉన్నత స్థాయి అధికారులు మరణించారు. అయితే ఓ మంత్రి ఇలా చనిపోవడం ఇదే తొలిసారి. ఈ ఘటన దేశంలో ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. ఈ కాల్పులపై ఆర్మీ ప్రతినిధి బ్రిగ్ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన అని.. దర్యాప్తు జరిపి ప్రజలకు వివరాలు తెలియజేస్తామని ట్వీట్ చశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
-
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!