Body Guard : బాడీని సేవ్ చేయమంటే.. బాడీనే లేకుండా చేసిన బాడీగార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Body Guard : ఎంత మనకింద పని చేసేవాళ్లనైనా చులకనగా చూడకూడదు. వాళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. వాళ్లకు ప్రతినెల జీతం ఇవ్వకుంటూ వాళ్లు ఇబ్బందులు పడతారు. చాలా కాలం పాటు జీతం ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. యజమాని ఎంతటివాడైనా నిలదీయడం సహజం. అలాంటి ఘటనే ఉగాండాలో మంగళవారం చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ నిలదీయడాలు లేవు. ఏకంగా తుపాకీ పెట్టి కాల్చేశాడు. చాలా కాలం నుంచి జీతం ఇవ్వడం లేదని ఓ మంత్రిని అతడి బాడీగార్డే కాల్చి చంపాడు.
Read Also: Auto workers: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా.. మద్దతుగా భట్టివిక్రమార్క
Also Read
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
సైన్యం, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్య ఓ ప్రైవేట్ వివాదంలో జరిగింది. బాధితుడు చార్లెస్ ఎంగోలా రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన ప్రెసిడెంట్ యోవేరి ముసెవేని ప్రభుత్వంలో కార్మిక శాఖకు జూనియర్ మంత్రిగా పనిచేస్తున్నాడు. మంత్రి ఉగాండా రాజధాని కంపాలా శివారులోని ఎంగోలాలోని తన ఇంటిలో ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం అతడు కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కానీ.. గార్డుకు మంత్రికి వేతనాలపై గొడవ జరుగుతుందని స్థానిక ప్రెస్ నోట్ పేర్కొంది.
Read Also:Tamilnadu : తమిళనాడులో దారుణం.. ఐదుగురు చిన్నారులపై గ్యాంగ్ రేప్
ఒక మంత్రిగా ఉండి కూడా తనకు చాలా కాలంగా జీతాలు ఇవ్వలేదని బాడీ గార్డు ఆందోళన చెందుతున్నట్లు, అందుకే అతడు కాల్పులకు ఒడిగట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా.. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో జరిగిన తుపాకీ దాడుల్లో ఉన్నత స్థాయి అధికారులు మరణించారు. అయితే ఓ మంత్రి ఇలా చనిపోవడం ఇదే తొలిసారి. ఈ ఘటన దేశంలో ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. ఈ కాల్పులపై ఆర్మీ ప్రతినిధి బ్రిగ్ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన అని.. దర్యాప్తు జరిపి ప్రజలకు వివరాలు తెలియజేస్తామని ట్వీట్ చశారు.
తాజావార్తలు
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!