Jay Shah: క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా..
- ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్
- భారత్ కు ఆరు పతకాలు
- క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన జై షా
- ఎన్ సీఏలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడాకారులు కూడా ప్రాక్టీస్ కి అవకాశం
- వారికి మెరుగైన సౌకర్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిసింది. ఈసారి భారతదేశం నుంచి 117 మంది అథ్లెట్ల బృందం పాల్గొనగా.. అందులో దేశానికి 1 రజతం, 5 కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) సిద్ధమవుతుందని.. ఇందులో క్రికెటర్లతో పాటు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా ఇతర అథ్లెట్లు కూడా ప్రాక్టీస్ చేయగలరని ఆయన చెప్పారు. వారికి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
READ MORE: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..
Also Read
భారత అథ్లెట్లను ఆదుకునేందుకు బీసీసీఐ ఎప్పుడూ ముందుంటుందని జై షా అన్నారు. ‘నీరజ్ చోప్రా వంటి ఒలింపిక్ ప్లేయర్లకు కూడా దీన్ని అందుబాటులో ఉంచబోతున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి ఓ జాతీయ మీడియా సంస్థకి తెలిపారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) బెంగళూరులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నగరంలో కొత్త ఎన్ సీఈ కూడా దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో దీనిని ప్రారంభించనున్నారు. బీసీసీఐ యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్లలో హై పెర్ఫార్మెన్స్ సెంటర్ కూడా ఒకటి. ఇటీవల జై షా నీరజ్ చోప్రాను కలిశారు. అప్పుడు బీసీసీఐ కార్యదర్శి డబుల్ ఒలింపిక్ పతక విజేత నీరజ్తో మాట్లాడుతూ.. క్రికెటర్లు కానివారికి కూడా అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు జే షా తన వాగ్దానాన్ని నెరవేర్చారు.
READ MORE: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నేను అక్టోబర్ 2019 లో బాధ్యతలు స్వీకరించాను. కరోనా కారణంగా 2 సంవత్సరాలు కార్యాలయం మూతపడి ఉంది. సెకండ్ వేవ్ అప్పుడు (2022లో) వచ్చినప్పుడు.. ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. నా మొదటి పదవీ కాలంలోనే ఈ ప్రాజెక్టుకు పునాది పడినందుకు సంతోషిస్తున్నను.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?