NTV Telugu Site icon

UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

Rape

Rape

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది. అయితే ఆ చిన్నారిని చూసిన నిందితుడు కామంతో రగిలిపోయి.. రూ.20, చాక్లెట్‌తో ప్రలోభపెట్టి రాత్రి చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. రాంకోలా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Read Also: Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి

తమ ఊరికి వచ్చిన పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా చూసేందుకు తాను కూడా అక్కడికి వెళ్లానని నిందితుడు ప్రమోద్ సాహ్ని పోలీసులకు చెప్పాడు. అక్కడే ఉన్న బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 8 ఏళ్ల చిన్నారిని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరకు తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అమాయక బాధితురాలికి అతని పేరు తెలియదు.. చిన్నారి అతన్ని అంతగా గుర్తించలేదన్నారు. ఇంత దారుణమైన ఘటనకు పాల్పడి నిందితుడు హాయిగా జీవితం గడుపుదామనుకున్నాడు.. కానీ నేరస్థుడు ఎప్పటికైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందేనని పోలీసులు తెలిపారు.

Read Also: Rakshith Atluri: సైకో సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు: రక్షిత్ అట్లూరి ఇంటర్వ్యూ