TGTET 2025 : టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఈ నెల 18 నుండి టెట్ పరీక్షలు..
- తెలంగాణ టెట్-2025 షెడ్యూల్ విడుదల
- జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు
- పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGTET 2025 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు షిఫ్ట్ల్లో జరగనున్నాయి. పరీక్షలు రెండు పేపర్లుగా – పేపర్–1, పేపర్–2 విభజించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం జిల్లాల వారీగా పరీక్షల తేదీలు, సబ్జెక్టులు కేటాయించబడ్డాయి.
పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో షిఫ్ట్లో జరుగుతాయి. పేపర్–1ను రాయబోయే అభ్యర్థులు, ఐదో తరగతి వరకు బోధించాలనుకునే వారు కాగా, పేపర్–2ను రాయబోయే వారు ఆరో తరగతి పైగా బోధించాలనుకునే అభ్యర్థులు. పేపర్లు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉండగా, కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాలకూ అవకాశం కల్పించారు.
Also Read
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
- Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
- Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
Tragedy : రీల్స్ చేస్తూ ఆరుగురు అమ్మాయిల మృతి
జూన్ 18న ప్రారంభమయ్యే టెట్ పరీక్షలు మొదటగా మాథమెటిక్స్ & సైన్స్ (పేపర్–2) పరీక్షతో ప్రారంభమవుతాయి. వరుసగా 16 సెషన్లలో వివిధ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. చివరి రోజైన జూన్ 30న మైనారిటీ భాషల్లో పేపర్–2 మాథమెటిక్స్, సైన్స్ & సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.
ప్రతి జిల్లాలోని కేంద్రాలను స్పష్టంగా పేర్కొంటూ, సంబంధిత సబ్జెక్టుల పరీక్షలు ఏ తేదీన జరిగేలా కేటాయించారో విద్యార్థులకు వెల్లడించారు. నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, పటాన్చెరు, సంగారెడ్డి వంటి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు షెడ్యూల్లో తెలిపారు.
ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ జిల్లాకు అనుగుణంగా తేదీలను గమనించి సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు. త్వరలో హాల్టికెట్లు విడుదల కానుండగా, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
Vijay Shah: మరోసారి ఇరకాటంలో మధ్యప్రదేశ్ మంత్రి.. విపక్షాలు ధ్వజం
తాజావార్తలు
-
Nivin Pauly : 11 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న ప్రేమమ్ కాంబో
-
Virat Kohli Diet: ఒకప్పుడు మాంసాహారి.. ఇప్పుడు కఠిన శాకాహారి.. విరాట్ జీవితాన్ని మార్చింది ఎవరు?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
-
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
ట్రెండింగ్
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!