Site icon NTV Telugu

TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!

Tgsrtc

Tgsrtc

TGSRTC Driver Shankar Goud Dies: నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అపోలో ఆస్పత్రిలో శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. బంధువులకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని అప్పగించారు. స్వస్థలానికి శంకర్ గౌడ్ మృతదేహం తరలిస్తున్నారు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్న విషయం తెలిసిందే. గత రెండ్రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రంలోని అనేక చోట్ల కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సమ్మెలో పాల్గొన్న శంకర్‌గౌడ్(55) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయనను వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80 శాతం కాలినగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఈ రోజు అత్యక్రియలు జరగనున్నాయి. ప్రముఖ రాజయకీయ నాయకులు హాజరుకానున్నారు.

READ MORE: Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్

మరోవైపు.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని గుర్తు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version