Site icon NTV Telugu

TG EAPCET 2025: విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 29 నుంచే ఈఏపీసెట్ పరీక్షలు

Tg Eapcet 2025

Tg Eapcet 2025

TG EAPCET 2025: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఎపిసెట్ (TG EAPCET) 2025 పరీక్షలు ఈ నెల ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు మే 4 వరకు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించనుండగా.. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 2 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈఎపిసెట్ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించనున్నారు అధికారులు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతాల్లో, 124 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు ఇంజనీరింగ్ విభాగానికి 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లు విడుదల తేదీలు కూడా అధికారులు ప్రకటించారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులు ఏప్రిల్ 19 నుండి తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అభ్యర్థుల హాల్ టికెట్లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు సూచనలు చేశారు. “ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి ప్రవేశం కల్పించము” అని వారు స్పష్టం చేశారు. కాబట్టి పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు అధికారులు.

Exit mobile version