Terror Attack: పోలీస్ స్టేషన్పై ఉగ్రదాడి.. నలుగురు పోలీసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Attack: పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఆదివారం కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదుల దాడిలో నలుగురు పాకిస్తాన్ పోలీసులు మరణించారు. చాలా మంది ఈ దాడిలో గాయపడ్డారు. దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా సరిహద్దులో ఉన్న లకీ మార్వాట్లోని బార్గాయ్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో సహా మారణాయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులతో భీకర ఎదురుకాల్పులు జరిగిన తర్వాత అనుమానిత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొంది. అనుమానితుల ఆచూకీ కోసం భారీ పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రావిన్షియల్ పోలీసు చీఫ్ నుంచి తక్షణ నివేదికను కోరారు.అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా దుఃఖంలో ఉన్న కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని దాడిని ఖండించారు. పాకిస్థాన్లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు. దాడికి బాధ్యులెవరూ వెంటనే బాధ్యత వహించనప్పటికీ, జిల్లాలో పోలీసులపై గతంలో జరిగిన దాడులను తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తామే చేసినట్లు అంగీకరించింది. 2007లో అనేక తీవ్రవాద సంస్థల సమూహంగా ఏర్పాటైన టీటీపీ.. జూన్లో ఫెడరల్ ప్రభుత్వంతో అంగీకరించిన కాల్పుల విరమణను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్రవాద దాడులను నిర్వహించాలని దాని ఉగ్రవాదులను ఆదేశించింది.
Also Read
- RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
Kamal Haasan: భారత్ జోడో యాత్రలో రాహుల్తో కలిసి పాల్గొననున్న కమల్హాసన్!
గత నెలలో, ఉగ్రవాదులు పోలీసు పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి, అదే ప్రాంతంలో ఆరుగురు పోలీసులను చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ తాలిబాన్ ప్రకటించింది. 2009లో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి, సైనిక స్థావరాలపై దాడులు, 2008లో ఇస్లామాబాద్లోని మారియట్ హోటల్పై బాంబు దాడితో సహా పాకిస్థాన్ అంతటా అనేక ఘోరమైన దాడులకు ఆల్-ఖైదాకు సన్నిహితంగా భావిస్తున్న ఈ గ్రూపు చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
-
EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
-
RCB Victory Celebrations: ఆర్సీబీ ఫ్యాన్స్కు షాక్.. విజయోత్సవ ర్యాలీపై ఫ్రాంచైజీ కీలక ప్రకటన..
-
Peddi Ticket Booking :”పెద్ది” ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టికెట్ బుకింగ్స్ షురూ
-
Rajat Patidar History: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!