Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Tenth Student Was Gang Raped By School Staff And Then Murdered

Uttar Pradesh : టెన్త్ విద్యార్థినిపై స్కూల్ సిబ్బంది గ్యాంగ్ రేప్.. ఆపై హత్య

Published Date :May 28, 2023 , 7:02 am
By Rakesh Reddy
Uttar Pradesh : టెన్త్ విద్యార్థినిపై స్కూల్ సిబ్బంది గ్యాంగ్ రేప్.. ఆపై హత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అయోధ్యలో టెన్త్ విద్యార్థినిపై పాఠశాల సిబ్బంది అయిన స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్ ఇద్దరు దారుణానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ చేసి పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందకు తోసివేశారు. తీవ్రగాయాలతో ఆ బాలిక స్పాట్లోనే చనిపోయింది. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం భారీ పోలీసు బలగాల సమక్షంలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయిన కూతురికి ఆమె తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. అయోధ్యలో సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్లో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊయల నుంచి పడి టెన్త్ విద్యార్థిని మృతి చెందిందని స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. అయితే సీసీటీవీ ఫుటేజీలో పాఠశాల భవనంపై అంతస్తు నుంచి బాలిక పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Read Also:New Parliament Inauguration: మహత్తర ఘట్టం.. నేడు కొత్త పార్లమెంట్ ప్రారంభం

చనిపోయిన బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సమ్మర్ హాలీడేస్ కోసం పాఠశాల మూసివేయబడిన తర్వాత కూడా ప్రధానోపాధ్యాయుడు రష్మీ భాటియా తన కుతూరుని పాఠశాలకు పిలిచారని, ఉదయం 9.50 గంటలకు ప్రిన్సిపాల్ తనకు ఫోన్ చేశారనీ, తన కుతూరు ఊయల నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. తాను పాఠశాలకు చేరుకున్నప్పుడు.. తన బిడ్డను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారనీ, ఆమె శరీరంపై గాయాలు, ఇతర గుర్తులు ఉన్నాయని, ఉయల నుంచి పడిపోయడం వల్ల ఇలాంటి ఘోరం జరగదని, కావాలనే తన బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. అయితే.. పోలీసుల కథనం ప్రకారం.. పదో తరగతి విద్యార్థిని పాఠశాల చేరుకున్న తరువాత పాఠశాల మేనేజర్ బ్రిజేష్ యాదవ్, స్పోర్ట్స్ టీచర్‌ అభిషేక్ కన్నౌజియా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనీ, ఈ విషయం వెలుగులోకి రాకుండా.. ఆ చిన్నారిని పాఠశాల పై అంతస్తు నుంచి తోసేశారు. ఈ ఘటనలో స్కూల్ మేనేజర్ బ్రిజేష్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు రష్మీ భాటియా, స్పోర్ట్స్ టీచర్ అభిషేక్ కన్నౌజియాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పాస్కో కింద కూడా కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ యాజమాన్యం కుటుంబ సభ్యులను, పోలీసులను వేర్వేరుగా, తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి మోసం చేసిందని, రక్తపు ఆనవాళ్లు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశారనీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దానికి సంబంధించిన ఇతర ఆధారాలను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

Read Also:Pocharam Srinivas Reddy : ఆనాడు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు

అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ మధుబన్ సింగ్ మాట్లాడుతూ.. “అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం మధ్యాహ్నం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజర్, స్పోర్ట్స్ టీచర్‌పై మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయబడింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక అత్యాచారాన్ని నిర్ధారించిందా అన్న ప్రశ్నకు.. మధుబన్ సింగ్ మాట్లాడుతూ.. “మాకు చేరిన పోస్ట్‌మార్టం నివేదిక కాపీ చదవడం లేదు . మేము నివేదికను చదవడానికి ప్రయత్నిస్తున్నాము. అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక ఇంకా అందలేదని తెలిపారు. మరోవైపునిందితులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ayodhya rape
  • class 10th girl rape
  • rape in school
  • UP Police
  • uttar pradesh news

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions