తెలంగాణలో అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. వింటర్ సీజన్ పూర్తిగా పోకుండానే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఎడతెరిపి లేకుండా మండిపోవడంతో హైదరాబాద్లోని మోండా మార్కెట్, హయత్నగర్, బేగంపేట ప్రాంతాల్లో మంగళవారం 36.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, కాప్రా, సరూర్నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్తో సహా అనేక ఇతర ప్రాంతాలలో కూడా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతల స్థాయిలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగాయి. మంగళవారం ఉదయం 8.30 గంటలకు గత దశాబ్దంలో ఫిబ్రవరి 23, 2016న గమనించిన రికార్డు సగటు గరిష్ట ఉష్ణోగ్రతతో పోల్చితే నగరంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా ఉందని, దాదాపు ఐదు డిగ్రీల సెల్సియస్ తగ్గిందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కార్యాలయం నివేదించింది. ఉధృతమైన రోజులతో పాటు, రాత్రులు కూడా అసాధారణంగా వాతావరణం వేడిగా ఉంటోంది.
MLC Kavitha : కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
మంగళవారం సగటు కనిష్ట ఉష్ణోగ్రత 21.9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది, ఇది సంవత్సరంలో ఈ సమయంలో సాధారణ 18.9 డిగ్రీల సెల్సియస్ కంటే చాలా ఎక్కువ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రోజువారీ వాతావరణ నివేదిక గత సంవత్సరం ఇదే తేదీ నుండి డేటాను పోల్చి చూస్తే, కనిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదాహరణకు, మారేడ్పల్లిలో ఫిబ్రవరి 6, 2023న 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది, 2024లో అదే తేదీన 19.3 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. IMD-H సూచన ప్రకారం రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది, సగటు గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రతలు (మంగళవారం)