Temperature Drop: దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా… మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. తెలంగాణలో సాయంత్రం అయిందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి. బయట అడుగుపెడదామంటే జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆ సమయంలో ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మెదక్లో అత్యల్పంగా 14 డిగ్రీలు, పటాన్చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా మహబూబ్నగర్లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇటు నిజమాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయ్. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Read Also: Karthika Masam: కార్తిక సోమవారం ఈ స్తోత్రాలు వింటే ఇంటిల్లిపాదికి సుఖసంతోషాలు
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ఇక ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంటోంది. ఘాట్ రోడ్లో వెళ్లే వాహనదారులు.. మార్గం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి. కొందరైతే రోడ్లపై చలి మంటలు కాగుతూ సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. స్వెట్టర్లు వేసుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి. వృద్ధులు, చిన్నారులు చలి, పొగ మంచులో బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మూడు పూటలా వేడివేడి ఆహార పదార్థాలనే తినాలంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!