తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోల జాబితా బాగా పెరుగుతోంది. కొంతమంది హీరోలు తమ సినిమాల థియేట్రికల్ హక్కులతో పోల్చి చూస్తే భారీ మొత్తం లో పారితోషకం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.కొంతమంది హీరోలు సక్సెస్ లో ఉండటం వల్ల పారితోషకం ను పెంచుకుంటుండగా మరి కొందరు హీరోలు మాత్రం ఫ్లాపుల్లో ఉన్నా కూడా పారితోషికంను పెంచుతున్నారు. నాని మరియు రవితేజ పారితోషికాలు ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సాయితేజ్, రామ్, నిఖిల్ మరియు వరుణ్ తేజ్ పారితోషికాలు 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.
తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు పరిస్థితులు అంత ఆశాజనకంగా అయితే లేవు. మెజారిటీ సినిమాలు నిర్మాతలకు నష్టాలనే మిగుల్చుతున్నాయి. నిర్మాతకు నష్టం వస్తే ఆదుకోవడానికి కొంతమంది హీరోలు ఇష్టం గానే ఉండగా మరి కొందరు హీరోలు మాత్రం ఇష్టంగా లేరు. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో సినిమాలను నిర్మించే నిర్మాతల సంఖ్య కూడా తగ్గుతుంది.హీరోలు పారితోషికాలను తగ్గించుకుంటే బాగుంటుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో హీరోలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరీ చూడాలి.. టాలీవుడ్ హీరోలు రెమ్యునరేషన్లకు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇండస్ట్రీలో నిర్మాతల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.టాలీవుడ్ హీరోలు ఈ విధంగా అడుగులు వేస్తే ఎంతో బాగుంటుందని చెప్పవచ్చు. మరి టాలీవుడ్ హీరోల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి . టాలీవుడ్ హీరోలు కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు ఇతర భాషల్లో కూడా తమ సత్తా చాటాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలు ఇండస్ట్రీ స్థాయిని ఇంకా పెంచాలని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.