Kishan Reddy : తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు అతిపెద్ద ముందడుగు
- తెలంగాణలో రహదారి మౌలిక వసతుల విప్లవాత్మక అభివృద్ధి
- కొత్త రహదారి ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి
- కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిరంతర సహకారం అందించనుంది : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల కల్పనకు ఒక విప్లవాత్మక ముందడుగు పడిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఉత్తరాద్య విధానాల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణ రాష్ట్రానికి వస్తారని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5,413 కోట్ల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ మరింత బలపడుతుందనీ, పారిశ్రామిక వృద్ధికి ఇది కీలకంగా మారుతుందనీ, పలు వేల ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వ కట్టుదిట్టమైన భద్రతా, అభివృద్ధి లక్ష్యాల ప్రకారం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మౌలిక వసతుల రంగంలో నిరంతర సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
ప్రాజెక్టుల వివరాలను చూస్తే, సిర్పూర్–కాగజ్నగర్ ప్రాంతానికి సంబంధించిన రహదారి అభివృద్ధికి ఒక్కటే రూ.3,862 కోట్ల వ్యయం కేటాయించబడి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.3,694 కోట్లతో 123 కిలోమీటర్ల పొడవున రహదారులు నిర్మించబడ్డాయని, ఇవి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే 8.1 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి రూ.168.47 కోట్లు మంజూరు చేసి భూమిపూజ నిర్వహించనున్నారు.
ఇక హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేకంగా రూ.1,552.91 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించబడ్డాయి. ఇందులో భాగంగా రూ.895.64 కోట్ల వ్యయంతో 22.57 కిలోమీటర్ల రహదారులు నిర్మించబడ్డాయి. మరోవైపు, రూ.657.27 కోట్లతో 20.87 కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ మొత్తం అభివృద్ధి ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో రవాణా సౌలభ్యతను పెంచడంతో పాటు, ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేసి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!