తెలంగాణ పీజీ ఈసెట్ (TG PGECET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ (JNTUH) వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. మే 29 నుంచి జూన్ 1 వరకు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2026 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు తమ మార్కులను బట్టి ఫుల్టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్లతో పాటు గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి.
