Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Chief: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి అడవులను జల్లడపతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మే 21న నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నిజంగా మావోస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్కౌంటర్లో ఏకంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు. మావోయిస్టు చరిత్రలో ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవడం ఇదే మొదటి సారి. తాజాగా ఆయన స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీని నియమించినట్లు సెంట్రల్ కమిటీ తెలిపింది.
READ ALSO: Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్ను తగులబెట్టారు..! నేపాల్లో చెలరేగిన హింస..
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
దళితుడికి పార్టీ పగ్గాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు చెందిన దళితుడైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ తాజాగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సైనిక కమిషన్కు నాయకత్వం వహించారు. తాజాగా పార్టీ కమాండర్ మాద్వి హిడ్మా అలియాస్ సంతోష్ PLGA 1వ బెటాలియన్ను ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ అంతటా పార్టీ కార్యకలాపాలకు బాధ్యత వహించే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.
‘మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్’ మాజీ అధిపతి రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్కు దండకారణ్య జోనల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని మొదట భావించారు. కానీ ఆయన వయస్సు పెరగడం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు ఆ బాధ్యత అప్పగించనట్లు సమాచారం. మరో తెలంగాణ నాయకుడు తక్కల్పల్లి వాసుదేవరావు అలియాస్ అసన్న పేరు కూడా చర్చకు వచ్చింది. కానీ చివరికి హిడ్మాకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. సీపీఐ (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి 2019 నుంచి కనిపించకుండా పోయారు. కేంద్రం, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలు ఆయన జాడ కోసం వెతుకుతున్నాయి.
READ ALSO: Kaloji: నీ బానిసను నేను కాను.. తొత్తు కొడుకునసలే కాను..
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!