Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Chief: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి అడవులను జల్లడపతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మే 21న నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నిజంగా మావోస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్కౌంటర్లో ఏకంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు. మావోయిస్టు చరిత్రలో ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవడం ఇదే మొదటి సారి. తాజాగా ఆయన స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీని నియమించినట్లు సెంట్రల్ కమిటీ తెలిపింది.
READ ALSO: Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్ను తగులబెట్టారు..! నేపాల్లో చెలరేగిన హింస..
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
దళితుడికి పార్టీ పగ్గాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు చెందిన దళితుడైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ తాజాగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సైనిక కమిషన్కు నాయకత్వం వహించారు. తాజాగా పార్టీ కమాండర్ మాద్వి హిడ్మా అలియాస్ సంతోష్ PLGA 1వ బెటాలియన్ను ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ అంతటా పార్టీ కార్యకలాపాలకు బాధ్యత వహించే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.
‘మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్’ మాజీ అధిపతి రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్కు దండకారణ్య జోనల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని మొదట భావించారు. కానీ ఆయన వయస్సు పెరగడం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు ఆ బాధ్యత అప్పగించనట్లు సమాచారం. మరో తెలంగాణ నాయకుడు తక్కల్పల్లి వాసుదేవరావు అలియాస్ అసన్న పేరు కూడా చర్చకు వచ్చింది. కానీ చివరికి హిడ్మాకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. సీపీఐ (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి 2019 నుంచి కనిపించకుండా పోయారు. కేంద్రం, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలు ఆయన జాడ కోసం వెతుకుతున్నాయి.
READ ALSO: Kaloji: నీ బానిసను నేను కాను.. తొత్తు కొడుకునసలే కాను..
తాజావార్తలు
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!