Maoist Chief India: మావోయిస్ట్ సెంట్రల్ చీఫ్ కుర్చీపై తెలంగాణ వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Chief: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి అడవులను జల్లడపతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మే 21న నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ నిజంగా మావోస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్కౌంటర్లో ఏకంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు. మావోయిస్టు చరిత్రలో ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవడం ఇదే మొదటి సారి. తాజాగా ఆయన స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీని నియమించినట్లు సెంట్రల్ కమిటీ తెలిపింది.
READ ALSO: Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్ను తగులబెట్టారు..! నేపాల్లో చెలరేగిన హింస..
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
దళితుడికి పార్టీ పగ్గాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లకు చెందిన దళితుడైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేబూజీ తాజాగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సైనిక కమిషన్కు నాయకత్వం వహించారు. తాజాగా పార్టీ కమాండర్ మాద్వి హిడ్మా అలియాస్ సంతోష్ PLGA 1వ బెటాలియన్ను ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ అంతటా పార్టీ కార్యకలాపాలకు బాధ్యత వహించే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.
‘మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్’ మాజీ అధిపతి రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్కు దండకారణ్య జోనల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని మొదట భావించారు. కానీ ఆయన వయస్సు పెరగడం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు ఆ బాధ్యత అప్పగించనట్లు సమాచారం. మరో తెలంగాణ నాయకుడు తక్కల్పల్లి వాసుదేవరావు అలియాస్ అసన్న పేరు కూడా చర్చకు వచ్చింది. కానీ చివరికి హిడ్మాకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. సీపీఐ (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి 2019 నుంచి కనిపించకుండా పోయారు. కేంద్రం, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థలు ఆయన జాడ కోసం వెతుకుతున్నాయి.
READ ALSO: Kaloji: నీ బానిసను నేను కాను.. తొత్తు కొడుకునసలే కాను..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!