Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

Ponguleti

Ponguleti

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని, త్వరలో భూముల ధరలు పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన నిర్వహించిన చిట్‌చాట్‌లో కీలక విషయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూముల ధరలు పెంచలేదన్నారు. ధరణి సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందన్నారు. రెవెన్యూలో కొత్త పాలసీ తేబోతున్నాం.. కసరత్తు జరుగుతుందని చెప్పారు. కేబినెట్ విస్తరణపై కూడా చర్చ ఉందని.. విడతల వారీగా జరుగుతుందని వెల్లడించారు.

READ MORE: Shreyas Iyer: ‘సర్పంచ్ సాబ్’.. శ్రేయస్ అయ్యర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

“నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉంటుంది. సమ్మర్ అయ్యాకే జడ్పీటీసీ – ఎంపీటీసీ ఎన్నికలు జరగవచ్చు. అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని త్వరలో పరిష్కరిస్తాం. నాలుగు రకాల కంప్లైంట్స్ ను పరిష్కరించేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించాం. ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదు.. శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజం. అసెంబ్లీలో నాపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారు. ప్రతిపక్షం ట్రాప్ లో నేను పడను. అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్ట్ తయారు అవుతుంది. సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయి.” అని చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Exit mobile version