Hyderabad: ఏఈఈ నిఖేష్ కుమార్కు 14 రోజుల రిమాండ్..
- తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్కు 14 రోజుల రిమాండ్
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్ అరెస్ట్
- నిఖేష్ కుమార్ నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తుల గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గండిపేట మండలం పీరంచెరువు పెబెల్సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్ను అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. ఈ క్రమంలో నిఖేశ్ కూమార్కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారుల సోదాల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిఖేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు మొత్తం 20 వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా విలువగల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నిఖేశ్ కుమార్కు కొల్లూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొయినాబాద్లో మూడు ఫాంహౌజ్లు, మూడు విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. తన ఎస్బీఐ అకౌంట్ ద్వారా నిఖేష్ కుమార్ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపాడు. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నిఖేష్ కుమార్కు మంచి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Rain Alert : పుదుచ్చేరిలో 47 సెంటీమీటర్ల వర్షం.. ఇళ్లలోకి వరద.. భారీ నష్టం.. ఆర్మీ పిలుపు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఆరు నెలల క్రితం లంచం తీసుకుంటూ నిఖేష్ కుమార్ పట్టుబడ్డాడు. అతని వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ రైడ్ చేసింది. ఆ సమయంలో రూ. 100 కోట్లకు పైగా విలువ చేసే అక్రమాస్తులు బయటపడ్డాయి. అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు అధికారులు. 2 నెలల తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటికొచ్చాడు. అప్పటి కేసులో మళ్లీ తాజాగా తీగ లాగారు. దీంతో కళ్లు తేరేసే రీతిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. తాజాగా మరోసారి ఆయన్ను అరెస్ట్ చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Drunk and Drive: వీరంగం సృష్టించిన మందుబాబు.. పోలీసులతో వాగ్వాదం
గండిపేట చెరువు అక్రమ నిర్మాణాలలో నిఖేష్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాడు. నిఖేష్ కుమార్ గండిపేట ఇరిగేషన్ ఏఈఈగా పనిచేశాడు. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ (గండిపేట) చెరువును కాపాడాల్సిన నిఖేష్.. నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు. చెరువు, ఎఫ్టీఎల్ బఫర్లను కబ్జా చేస్తుంటే చూసి చూడనట్టు వదిలిపెట్టాడు. కోకాపేట, గండిపేట, నార్సింగ్, మంచి రేవుల అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు. ఈ ప్రాంతంలో బుల్కాపూర్ నాళా, మూసి పరిధిలో అపార్ట్మెంట్, విల్లాలు అనుమతి ఇచ్చాడు. నిఖేష్ ప్రముఖ కంపెనీలకు అనుమతి ఇచ్చి షేర్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!