TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యా మండలి (TGBIE) విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని మరియు మార్కుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం రెండో సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ను ఇప్పుడు రెండు సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో సంవత్సరంలో 15 మార్కులు ప్రాక్టికల్స్కు కేటాయించగా, థియరీ పరీక్ష 60 మార్కులకు పరిమితం అవుతుంది.
గణితం (Maths-A And B) సబ్జెక్టుల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో 75 మార్కులకు ఉన్న థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించి, మిగిలిన 15 మార్కులను ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ABL) ద్వారా ఇంటర్నల్ అసెస్మెంట్ కింద ప్రతి ఏటా కేటాయిస్తారు. అదేవిధంగా భాషా సబ్జెక్టులు మరియు హ్యుమానిటీస్ (కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ) గ్రూపులకు 20 మార్కుల ఇంటర్నల్ అసెస్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఈ సబ్జెక్టుల థియరీ పరీక్షలు 100 మార్కుల నుంచి 80 మార్కులకు తగ్గుతాయి. MEC విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 80 మార్కుల థియరీ, 20 మార్కుల ఇంటర్నల్స్ కలిగిన క్వశ్చన్ పేపర్ను రూపొందించారు.
Also Read
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో ‘ACE’ అనే సరికొత్త గ్రూపును బోర్డు ప్రారంభించింది. పాఠ్యపుస్తకాలను కూడా నిపుణుల కమిటీ ద్వారా ఆధునీకరించి, క్యూఆర్ కోడ్లు, సిమ్యులేషన్స్, డయాగ్రమ్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ వంటి అంశాలను జోడించారు. సవరించిన ఈ నూతన పాఠ్యపుస్తకాలు జూన్ 1, 2026 లోపు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పులన్నీ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి మరియు కేవలం మార్కుల కోసమే కాకుండా విషయ పరిజ్ఞానం కోసం చదివేలా ప్రోత్సహించడానికి దోహదపడనున్నాయి.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!