Minister KTR: అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణదే మొదటి స్థానం

Ktr

Ktr

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేస్తున్న కృషికి మరో జాతీయ గుర్తింపు దక్కింది. అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ తన ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్ 2023: ఇన్ ఫిగర్స్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మున్సిపల్ వ్యర్థాల శుద్ధి విషయంలో కూడా తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన నివేదిక అటవీ విస్తీర్ణంలో 10కి 7 కంటే ఎక్కువ స్కోర్ సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ 7.21, గుజరాత్‌ 6.5, 6.3 పాయింట్లతో గోవాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Also Read : Priyanka chopra: ఆ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా.. షాక్ లో నెటిజన్స్..

2019తో పోలిస్తే 2021 మదింపులో మొత్తం అటవీ విస్తీర్ణంలో తెలంగాణ కూడా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ నివేదికపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘హరితహారం’ను సమర్థవంతంగా అమలు చేశామని అన్నాడు. గత ఏడాది జూన్ 19న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఈ ఏడాది మొత్తం 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 14,864 నర్సరీల్లో 30.29 కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచాల్సి ఉంది.

Also Read : Odisha Train Accident: సిగ్నలింగ్ లోపాలపై మూడు నెలల క్రితమే అధికారి హెచ్చరిక..

అడవుల విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎస్‌ఈ తెలిపిన నివేదికపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణకు శుభవార్త.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన తాజా పుస్తకం అన్ని భారతీయ రాష్ట్రాలలో స్పష్టమైన నంబర్ వన్‌గా నిలిచింది.. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వానికి, ఆయన ఆలోచనలకు వందనాలు అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.