High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భర్తను కడతేర్చిన కేసులో ఓ భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఓ గొడవ సందర్భంగా భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు, ఆమెను సెక్షన్ 304 పార్ట్-II (హత్యకాని నేరపూరిత నరహత్య) కింద దోషిగా తేల్చి, నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ తిరుమల దేవి ఈడ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ, కేవలం 500 రూపాయల జరిమానాతో ఈ కేసును ముగించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సంఘటన జరిగిన రోజు మృతుడు మొదట పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. కానీ మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా వచ్చి, భార్యను, ఆమె తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భార్య, తన వద్ద ఉన్న కత్తితో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మృతి చెందాడు. ఈ కేసు విచారణలో భాగంగా భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, భర్త ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఆమె తీవ్ర ఆవేదనకు లోనైందని పేర్కొంది. ఆమెకు తన భర్తను చంపాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని, అప్పటికప్పుడు జరిగిన గొడవలో ఆవేశంతో అలా చేసిందని వాదించింది. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలను కోర్టు ముందు ఉంచింది. మెడపై తీవ్రమైన గాయం కావడం వల్లే కీలక అవయవాలు దెబ్బతిని అతను చనిపోయాడని వైద్య నివేదికలు ధృవీకరించాయి.
Also Read
అన్ని ఆధారాలను, పరిస్థితులను పరిశీలించిన హైకోర్టు ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని స్పష్టం చేసింది. భర్త అసభ్యకర ప్రవర్తన వల్ల కలిగిన ఆకస్మిక ఆవేశంలోనే (Spur of anger) ఈ ఘోరం జరిగిందని, ఇది ఐపీసీ సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 4 కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే సెక్షన్ 304 పార్ట్-II కింద ఆమె నేరాన్ని సమర్థిస్తూనే.. పరిస్థితులను బట్టి జైలు శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే ఆమె చెల్లించిన 500 రూపాయల జరిమానాను శిక్షగా పరిగణిస్తూ కేసును కొట్టిపారేసింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, నేరం వెనుక ఉన్న పరిస్థితులు శిక్షను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
తాజావార్తలు
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్పై అమెరికా దాడి…
-
Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
-
PM Modi: ‘మేక్ ఇన్ ఇండియా’ గ్లోబల్ బ్రాండ్గా మారింది
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!