High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భర్తను కడతేర్చిన కేసులో ఓ భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఓ గొడవ సందర్భంగా భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు, ఆమెను సెక్షన్ 304 పార్ట్-II (హత్యకాని నేరపూరిత నరహత్య) కింద దోషిగా తేల్చి, నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ తిరుమల దేవి ఈడ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ, కేవలం 500 రూపాయల జరిమానాతో ఈ కేసును ముగించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సంఘటన జరిగిన రోజు మృతుడు మొదట పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. కానీ మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా వచ్చి, భార్యను, ఆమె తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భార్య, తన వద్ద ఉన్న కత్తితో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మృతి చెందాడు. ఈ కేసు విచారణలో భాగంగా భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, భర్త ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఆమె తీవ్ర ఆవేదనకు లోనైందని పేర్కొంది. ఆమెకు తన భర్తను చంపాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని, అప్పటికప్పుడు జరిగిన గొడవలో ఆవేశంతో అలా చేసిందని వాదించింది. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలను కోర్టు ముందు ఉంచింది. మెడపై తీవ్రమైన గాయం కావడం వల్లే కీలక అవయవాలు దెబ్బతిని అతను చనిపోయాడని వైద్య నివేదికలు ధృవీకరించాయి.
Also Read
- Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
- OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
- Income Tax: భారత్లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
అన్ని ఆధారాలను, పరిస్థితులను పరిశీలించిన హైకోర్టు ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని స్పష్టం చేసింది. భర్త అసభ్యకర ప్రవర్తన వల్ల కలిగిన ఆకస్మిక ఆవేశంలోనే (Spur of anger) ఈ ఘోరం జరిగిందని, ఇది ఐపీసీ సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 4 కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే సెక్షన్ 304 పార్ట్-II కింద ఆమె నేరాన్ని సమర్థిస్తూనే.. పరిస్థితులను బట్టి జైలు శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే ఆమె చెల్లించిన 500 రూపాయల జరిమానాను శిక్షగా పరిగణిస్తూ కేసును కొట్టిపారేసింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, నేరం వెనుక ఉన్న పరిస్థితులు శిక్షను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
తాజావార్తలు
-
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
-
Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
-
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
-
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?