High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భర్తను కడతేర్చిన కేసులో ఓ భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఓ గొడవ సందర్భంగా భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు, ఆమెను సెక్షన్ 304 పార్ట్-II (హత్యకాని నేరపూరిత నరహత్య) కింద దోషిగా తేల్చి, నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ తిరుమల దేవి ఈడ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ, కేవలం 500 రూపాయల జరిమానాతో ఈ కేసును ముగించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సంఘటన జరిగిన రోజు మృతుడు మొదట పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. కానీ మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా వచ్చి, భార్యను, ఆమె తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భార్య, తన వద్ద ఉన్న కత్తితో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మృతి చెందాడు. ఈ కేసు విచారణలో భాగంగా భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, భర్త ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఆమె తీవ్ర ఆవేదనకు లోనైందని పేర్కొంది. ఆమెకు తన భర్తను చంపాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని, అప్పటికప్పుడు జరిగిన గొడవలో ఆవేశంతో అలా చేసిందని వాదించింది. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలను కోర్టు ముందు ఉంచింది. మెడపై తీవ్రమైన గాయం కావడం వల్లే కీలక అవయవాలు దెబ్బతిని అతను చనిపోయాడని వైద్య నివేదికలు ధృవీకరించాయి.
Also Read
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
అన్ని ఆధారాలను, పరిస్థితులను పరిశీలించిన హైకోర్టు ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని స్పష్టం చేసింది. భర్త అసభ్యకర ప్రవర్తన వల్ల కలిగిన ఆకస్మిక ఆవేశంలోనే (Spur of anger) ఈ ఘోరం జరిగిందని, ఇది ఐపీసీ సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 4 కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే సెక్షన్ 304 పార్ట్-II కింద ఆమె నేరాన్ని సమర్థిస్తూనే.. పరిస్థితులను బట్టి జైలు శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే ఆమె చెల్లించిన 500 రూపాయల జరిమానాను శిక్షగా పరిగణిస్తూ కేసును కొట్టిపారేసింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, నేరం వెనుక ఉన్న పరిస్థితులు శిక్షను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
తాజావార్తలు
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..