High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భర్తను కడతేర్చిన కేసులో ఓ భార్యకు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సంచలన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో ఓ గొడవ సందర్భంగా భార్య తన భర్తను కత్తితో పొడిచి చంపింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు, ఆమెను సెక్షన్ 304 పార్ట్-II (హత్యకాని నేరపూరిత నరహత్య) కింద దోషిగా తేల్చి, నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే, ఈ శిక్షను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ తిరుమల దేవి ఈడ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ, కేవలం 500 రూపాయల జరిమానాతో ఈ కేసును ముగించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సంఘటన జరిగిన రోజు మృతుడు మొదట పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. కానీ మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా వచ్చి, భార్యను, ఆమె తల్లిదండ్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ నానా హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భార్య, తన వద్ద ఉన్న కత్తితో భర్త మెడపై పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను మృతి చెందాడు. ఈ కేసు విచారణలో భాగంగా భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, భర్త ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉండటం వల్లే ఆమె తీవ్ర ఆవేదనకు లోనైందని పేర్కొంది. ఆమెకు తన భర్తను చంపాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని, అప్పటికప్పుడు జరిగిన గొడవలో ఆవేశంతో అలా చేసిందని వాదించింది. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఇరుగుపొరుగు సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, నిందితురాలు చూపించిన కత్తిని స్వాధీనం చేసుకోవడం వంటి అంశాలను కోర్టు ముందు ఉంచింది. మెడపై తీవ్రమైన గాయం కావడం వల్లే కీలక అవయవాలు దెబ్బతిని అతను చనిపోయాడని వైద్య నివేదికలు ధృవీకరించాయి.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
అన్ని ఆధారాలను, పరిస్థితులను పరిశీలించిన హైకోర్టు ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని స్పష్టం చేసింది. భర్త అసభ్యకర ప్రవర్తన వల్ల కలిగిన ఆకస్మిక ఆవేశంలోనే (Spur of anger) ఈ ఘోరం జరిగిందని, ఇది ఐపీసీ సెక్షన్ 300లోని ఎక్సెప్షన్ 4 కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే సెక్షన్ 304 పార్ట్-II కింద ఆమె నేరాన్ని సమర్థిస్తూనే.. పరిస్థితులను బట్టి జైలు శిక్షను రద్దు చేసింది. ఇప్పటికే ఆమె చెల్లించిన 500 రూపాయల జరిమానాను శిక్షగా పరిగణిస్తూ కేసును కొట్టిపారేసింది. స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ, నేరం వెనుక ఉన్న పరిస్థితులు శిక్షను తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..