Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- తీవ్ర ఎండలతో అల్లాడుతోన్న తెలంగాణ
- పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
- రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heatwave Alert for Next 5 Days: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఎండలతో అల్లాడుతోంది. మండుతున్న ఎండలతో రాష్ట్రం మొత్తం హీట్ కోర్ జోన్గా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్లు జారీ చేశారు. రాబోయే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని సూచించారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
రేపటి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాకు కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మధ్యాహ్న సమయంలో రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. రైతులు, కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!