తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీని కోసం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించవలసి ఉంటుంది.
Read Also: Mahua Moitra: లోక్సభ ఎంపీగా బహిష్కరణ.. సుప్రీంను ఆశ్రయించిన మహువా మోయిత్రా
ఇక, ఈ గ్యారెంటీలలోనే మరొకటి మహిళలకు కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఈ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని చెప్పింది. అయితే ఈ పథకం కోసం ఈ-కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదు అని వదంతంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం అవుతుంది. వెంటనే మహిళలందరూ కూడా ఆధార్ కార్డులతో గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు. కాగా, కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ-కేవైసీ చేసుకొని మహిళలందరు వెంటనే చేయించుకోవాలని వెల్లడించింది. అయితే ఈ ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదు అని గ్యాస్ ఏజెన్సీలు ప్రకటించాయి.
అయితే, చాలా మంది గ్యాస్ సబ్సిడీ రావాలంటే ఈ-కేవైసీ చేయించుకోవాలనే దుష్ప్రచారని వ్యా్ప్తి చేస్తున్నారు. దీంతో తమకి ఈ-కేవైసీ పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ సిలిండర్ రాదు అనుకుని మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు భారీగా క్యూ కట్టారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం అలాంటివి ఏమీ లేదని కేవలం ఈ-కేవైసీ పూర్తి కానీ వారికి మాత్రమే చేస్తున్నామని తెలిపాయి. తెలంగాణలో గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.