Site icon NTV Telugu

Ponnam Prabhakar : కారుణ్య నియామ‌కాలపై ప్రభుత్వం శుభవార్త..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

10 సంవత్సరాలుగా కండక్టర్ కారుణ్య నియామ‌కాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల కింద 813 మందికి కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో ప‌ని చేస్తూ విధి నిర్వహ‌ణ‌లో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండ‌క్ట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. బ్రెడ్ విన్న‌ర్ (కార‌ణ్య నియామ‌కాలు), మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి/పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హ‌త‌ల ప్ర‌కారం ఉద్యోగాలు కల్పిస్తుంది. సర్వీసులో ఉండగా మరణించిన సంస్థ‌ సిబ్బంది కుటుంబాలకు ఇదొక ఊరట అని చెప్పుకోవ‌చ్చు.

హైద‌రాబాద్ (66), సికింద్రాబాద్ (126). రంగారెడ్డి (52), న‌ల్గొండ (56), మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (83), మెద‌క్ (93), వ‌రంగ‌ల్ (99), ఖ‌మ్మం (53), అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), క‌రీంన‌గ‌ర్ (45) రీజియ‌న్ల నుంచి మొత్తం 813 కండ‌క్ట‌ర్ పోస్టుల‌ను సంస్థ‌ భ‌ర్తీ చేయ‌నుంది. టీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామ‌కాల కింద కండ‌క్ట‌ర్ల‌ను నియ‌మించనున్న‌ట్లు స్ఫ‌ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 10 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపట్టాము..దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాడని అధికారులకు ఆదేశాలు జారి చేయబడ్డాయి.. దింతో చాలా సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను న్యాయం జరిగిందని తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు..

Exit mobile version