BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ కాదని.. తెచ్చుకున్నది తెలంగాణ సమాజం అని ఎంపీ లక్షణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎంపీ లక్షణ్ మాట్లాడారు.
బీజేపీ ఎంపీ లక్షణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ ఉద్యమానికి ఏబీవీపీ నాంది పలికింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కాలరాసింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీఅనేక మందిని పొట్టనపెట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, పార్లమెంట్లో గళం విప్పింది. కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించింది. యూపీఏ ప్రభుత్వం కళ్లుతెరవాలని శ్రీకాంత్ చారితో మొదలు పెడితే.. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. 12 వందల మంది అమరులు అయ్యారు. వారి బలిదానాలతో తెలంగాణ వచ్చింది. బలిదేవత సోనియా గాంధీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి భక్తుడు అయ్యాడు’ అని అన్నారు.
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
Also Read: CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్కి జ్ఞానోదయం కలగలేదు!
‘ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంని అనుభవిస్తుంది. ఏ విధంగా సలహాదారుగా ఉన్నావో అని కోదండ రామ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం, కోదండ రామ్ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఉచిత గ్యారంటీలు ఓట్లు దందుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. సుష్మ స్వరాజ్ మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు. ఆమెను విస్మరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిపోతే.. ఈ సీఎం ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచుకోవడం కోసం రాజీపడుతున్నారు. పోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో.. లేకుంటే నీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. 5 ఏళ్లు నీకు కష్టమే’ అని బీజేపీ ఎంపీ లక్షణ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!