BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ కాదని.. తెచ్చుకున్నది తెలంగాణ సమాజం అని ఎంపీ లక్షణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎంపీ లక్షణ్ మాట్లాడారు.
బీజేపీ ఎంపీ లక్షణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ ఉద్యమానికి ఏబీవీపీ నాంది పలికింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కాలరాసింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీఅనేక మందిని పొట్టనపెట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, పార్లమెంట్లో గళం విప్పింది. కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించింది. యూపీఏ ప్రభుత్వం కళ్లుతెరవాలని శ్రీకాంత్ చారితో మొదలు పెడితే.. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. 12 వందల మంది అమరులు అయ్యారు. వారి బలిదానాలతో తెలంగాణ వచ్చింది. బలిదేవత సోనియా గాంధీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి భక్తుడు అయ్యాడు’ అని అన్నారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Also Read: CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్కి జ్ఞానోదయం కలగలేదు!
‘ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంని అనుభవిస్తుంది. ఏ విధంగా సలహాదారుగా ఉన్నావో అని కోదండ రామ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం, కోదండ రామ్ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఉచిత గ్యారంటీలు ఓట్లు దందుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. సుష్మ స్వరాజ్ మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు. ఆమెను విస్మరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిపోతే.. ఈ సీఎం ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచుకోవడం కోసం రాజీపడుతున్నారు. పోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో.. లేకుంటే నీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. 5 ఏళ్లు నీకు కష్టమే’ అని బీజేపీ ఎంపీ లక్షణ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..