BJP MP K Laxman: విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ కాదని.. తెచ్చుకున్నది తెలంగాణ సమాజం అని ఎంపీ లక్షణ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎంపీ లక్షణ్ మాట్లాడారు.
బీజేపీ ఎంపీ లక్షణ్ మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ ఉద్యమానికి ఏబీవీపీ నాంది పలికింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కాలరాసింది. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీఅనేక మందిని పొట్టనపెట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, పార్లమెంట్లో గళం విప్పింది. కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించింది. యూపీఏ ప్రభుత్వం కళ్లుతెరవాలని శ్రీకాంత్ చారితో మొదలు పెడితే.. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. 12 వందల మంది అమరులు అయ్యారు. వారి బలిదానాలతో తెలంగాణ వచ్చింది. బలిదేవత సోనియా గాంధీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి భక్తుడు అయ్యాడు’ అని అన్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Also Read: CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్కి జ్ఞానోదయం కలగలేదు!
‘ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంని అనుభవిస్తుంది. ఏ విధంగా సలహాదారుగా ఉన్నావో అని కోదండ రామ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం, కోదండ రామ్ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఉచిత గ్యారంటీలు ఓట్లు దందుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. సుష్మ స్వరాజ్ మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు. ఆమెను విస్మరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిపోతే.. ఈ సీఎం ఆ చిప్ప పట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచుకోవడం కోసం రాజీపడుతున్నారు. పోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకో.. లేకుంటే నీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. 5 ఏళ్లు నీకు కష్టమే’ అని బీజేపీ ఎంపీ లక్షణ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..