CM Revanth Reddy: నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి

  • నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి
  • పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం అయింది
  • సీబీఐ విచారణ సరిపోదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం అయిందని.. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సరిపోదన్నారు. కోట్లమంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశం, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మౌనం వహించడం సరికాదన్నారు. ఏ ఒక్కరి పైనో కేసు వేసి క్లోజ్ చేయడానికి సీబీఐకి అప్పగించారని.. జ్యుడీషియల్ ఎంక్వైరీ అవసరమన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన భరోసా ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వట్లేదన్నారు. మోడీ గ్యారెంటీ ఎక్కడ పోయిందని.. మోడీ గ్యారంటీ ఖతం అయిందని రేవంత్ అన్నారు. ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: KCR: ఆ కేసు కొట్టివేయాలి.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్‌

అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ జన్మ మొదలైంది కాంగ్రెస్‌లోనేనని, చివరికి ముగిసేది కాంగ్రెస్‌లోనే అంటూ వెల్లడించారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరానని, పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని తెలిపారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆరునెలలుగా పరిపాలనను గమనిస్తున్నానని, అంకితభావంతో రేవంత్ నడుపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని తెలిపారు. రైతులకు మంచి జరగాలనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తాను, తన సైన్యం మొత్తం కాంగ్రెస్‌లో చేరామన్నారు.