Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..
- కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్..
- విద్యా వ్యవస్థలో కుల వివక్ష నివారణకు బిల్లు..
- తల్లిదండ్రుల సంక్షేమం కోసం మరో బిల్లు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలపై సానుకూల ప్రభావం చూపనున్నాయి. ఈ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటానికి , సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026’ ను ఆమోదించింది. విద్వేషపూరిత ప్రసంగాలు, అల్లర్లను ప్రేరేపించే వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఈ చట్టం ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుంది. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
గిగ్ వర్కర్ల భద్రతకు పెద్దపీట..
రాష్ట్రంలో సుమారు 4.2 లక్షల మంది గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు (డెలివరీ బాయ్స్, డ్రైవర్లు మొదలైనవారు) ఉన్నారు. వీరి సంక్షేమం కోసం ‘తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026’ ను క్యాబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం వర్కర్ల రిజిస్ట్రేషన్తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వీరికి చట్టబద్ధమైన గుర్తింపుతో పాటు సామాజిక భద్రత లభిస్తుంది.
తల్లిదండ్రుల మద్దతు బిల్లు..
మానవీయ కోణంలో ప్రభుత్వం ఒక వినూత్న బిల్లును తీసుకొచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేస్తారు.
Also Read:Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..
మెట్రో రైలు స్వాధీనం..
హైదరాబాద్లోని ఫేజ్-1 మెట్రో (69 కి.మీ) వ్యవస్థను ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం రూ.15 వేల కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది.
న్యాయవాదుల రక్షణ బిల్లు..
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వామనరావు దంపతుల హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదులకు తగిన భద్రత కల్పించడమే దీని లక్ష్యం.
కులగణన నివేదిక, రోహిత్ వేముల చట్టం..
రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ పరిశీలించింది. అలాగే విద్యాసంస్థల్లో కుల వివక్షను నివారించేందుకు ‘రోహిత్ వేముల చట్టం’ విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!