Ponnam Prabhakar : మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- మేము పథకాలను నిలిపివేయలేదని స్పష్టం
- ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం – అప్పుల విషయంలో ప్రభుత్వం స్పష్టత
- రాష్ట్ర ఆదాయంపై కేంద్రం అణచివేత
- కేంద్రం సహకరించాలి – బీజేపీ వాగ్దానాలు తప్పుల తడకగా మారాయి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు.
“రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం మాకు తెలుసు. అయితే, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. తెలంగాణ ఆర్థికంగా ఎదిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవం కలిగినది, పాత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
Also Read
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, “కేంద్రం పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. బీజేపీ నేతలు తులం బంగారం గురించి మాట్లాడుతున్నారు. 15 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు, ఏమైపోయాయి? రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ వారి కోసం ఉరి చట్టాలు తీసుకొచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు” అని దుయ్యబట్టారు.
“తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే నిధులను కేంద్రం తిరిగి ఇవ్వడం లేదు. పైగా, బాత్రూంలపై, రేషన్ షాపులపై బీజేపీ నేతల ఫోటోలు పెట్టాలని చెబుతున్నారు” అని మంత్రి మండిపడ్డారు. “రైతు రుణమాఫీపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్మల్ నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు రూ.202.55 కోట్ల రుణ మాఫీ చేసింది. రెండు లక్షల లోపు రుణమాఫీ అమలు చేయడం ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాం. నిర్మల్కు వచ్చి దీనిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని ఒక్క అడుగు కూడా తగ్గించదని, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీజేపీ అనవసర విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
తాజావార్తలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..