Ponnam Prabhakar : మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- మేము పథకాలను నిలిపివేయలేదని స్పష్టం
- ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం – అప్పుల విషయంలో ప్రభుత్వం స్పష్టత
- రాష్ట్ర ఆదాయంపై కేంద్రం అణచివేత
- కేంద్రం సహకరించాలి – బీజేపీ వాగ్దానాలు తప్పుల తడకగా మారాయి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు.
“రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం మాకు తెలుసు. అయితే, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. తెలంగాణ ఆర్థికంగా ఎదిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవం కలిగినది, పాత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
Also Read
మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, “కేంద్రం పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. బీజేపీ నేతలు తులం బంగారం గురించి మాట్లాడుతున్నారు. 15 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు, ఏమైపోయాయి? రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ వారి కోసం ఉరి చట్టాలు తీసుకొచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు” అని దుయ్యబట్టారు.
“తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే నిధులను కేంద్రం తిరిగి ఇవ్వడం లేదు. పైగా, బాత్రూంలపై, రేషన్ షాపులపై బీజేపీ నేతల ఫోటోలు పెట్టాలని చెబుతున్నారు” అని మంత్రి మండిపడ్డారు. “రైతు రుణమాఫీపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్మల్ నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు రూ.202.55 కోట్ల రుణ మాఫీ చేసింది. రెండు లక్షల లోపు రుణమాఫీ అమలు చేయడం ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాం. నిర్మల్కు వచ్చి దీనిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని ఒక్క అడుగు కూడా తగ్గించదని, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీజేపీ అనవసర విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!