AP Telangana Officers Meet: ఎక్కడి సమస్యలు అక్కడే.. పురోగతి లేని చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ తెలంగాణ విభజన జరిగి ఎనిమిదేళ్ళు పూర్తవుతున్నా.. ఇంకా విభజన అనంతరం సమస్యలకు ఇంకా మోక్షం లభించడం లేదు. ఎన్నిసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగినా చర్చలలో పురోగతి కనిపించడం లేదు. ఢిల్లీలో మరోమారు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు లాభదాయకంగా లేదన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్ వి.కే.త్రిపాఠి. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు నిర్ణయం ఎలా తీసుకొంటుందని ప్రశ్నించారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
Read Also: Mallareddy Narayana Hospital: మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ఈవెంట్
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకెళ్ళాలని, తుది నిర్ణయం తీసుకుంటుందని సూచించారు అజయ్ భల్లా. అమరావతి రాజధాని నిర్మాణం కోసం శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు ఏపీ ప్రభుత్వ అధికారులు. చట్ట ప్రకారం 2500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఈ మొత్తానికి సంబంధించిన ఖర్చుల ధృవీకరణపత్రాలను ( యు.సి) సమర్పించాలని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ( రూ. 1000 కోట్లు) విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని సూచించారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ లో ఆస్తుల విభజన పై షీలా బేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపీ అంగీకరించిందని, తెలంగాణ వ్యతిరేకించిందని తెలిపారు రాష్ట్ర అధికారులు. షీలా బేడీ కమిటీ సిఫార్సులు తప్పనిసరి అమలుకు కేంద్రమే ఉత్తర్వులు జారీ చేసేవిధంగా ఉన్న అవకాశం పై న్యాయ సలహా కోరుతామని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణకు మాత్రమే సంబంధించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, వెనుక బడిన జిల్లాల కు నిధుల మంజూరు అంశాల ను ప్రస్తావించారు తెలంగాణ అధికారులు. వెనుక బడిన జిల్లాలకు నిధులు వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ కు హోమ్ సెక్రెటరీ ఆదేశించారు. గిరిజన వర్శిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ల పై పరిశీలించి వెంటనే నిర్ణయాలు తీసుకొవాలనీ ఆయా శాఖలకు సూచించారు హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
Read Also: Mumbai: బురఖా ధరించడం లేదని భార్యను హత్య చేసిన భర్త
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!