Telangana 22A Land Issues: 22ఏ జాబితాలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు పరిష్కారం చూపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్గా సీసీఎల్ఏ కమిషనర్ ఉంటారు. ఇందులో సభ్యులుగా లా సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉండనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 118 జీవో బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై మంత్రి పొంగులేటి అసెంబ్లీలో మాట్లాడారు. “22A సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ వేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేశారు. నెల గడువు పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించాం. 118జీవోతో వచ్చిన సమస్యలపై కూడా మెమో ఇచ్చాం. నెల గడువు పెట్టుకుని సమస్య పరిష్కారం చేయాలని అని నిర్ణయించాం. రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ నుంచి రేపు దరఖాస్తులు తీసుకుంటాం. 22A నుంచి లిఫ్ట్ చేస్తాం.” అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు

22a
