IND vs ENG 2nd ODI: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
- కటక్ వన్డేలో భారత్ ఘన విజయం
- 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం
- కటక్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ
- వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కటక్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మూడు వన్డేల సిరీస్లో 2-0 తో భారత్ ఆధిక్యంలో ఉంది. దీంతో.. వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు.
Read Also: Viral Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 23 ఏళ్ల యువతి..
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
భారత్ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా.. విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41) పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 2 వికెట్లు సాధించాడు. అటిక్సన్, ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (65), జో రూట్ (69) ఆఫ్ సెంచరీలు సాధించారు. చివర్లో లివింగ్స్టన్ 32 బంతుల్లో 41 పరుగులు చేశాడు. బట్లర్ (34), ఫిల్ సాల్ట్ (26) పరుగులు చేశారు. భారత్ బ్యాటర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. షమీ, హర్షి్త్ రాణా, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. కాగా.. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇంతకుముందు.. టీ20 సిరీస్ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. కాగా.. మూడో వన్డే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది.
Read Also: Palnadu: పల్నాడులో ఘోర ప్రమాదం.. సీఎం, రవాణాశాఖ మంత్రి దిగ్భ్రాంతి ..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!