IND vs BAN: 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్కు ప్రత్యేకంగా చెన్నై టెస్ట్!
- బంగ్లాదేశ్పై ఘన విజయం
- భారత్ జట్టు ఖాతాలో అరుదైన ఘనత
- క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Creates History in 92 Years Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు ఓటముల కంటే.. ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. అంతేకాదు అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలవడం విశేషం.
భారత జట్టు 1932లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. బంగ్లాదేశ్తో మ్యాచ్ను కలుపుకొని ఇప్పటివరకు 580 టెస్టులు ఆడింది. ఇందులో 179 విజయాలు ఉండగా.. 178 ఓటములు ఉన్నాయి. 222 మ్యాచ్లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు ప్రత్యేకంగా నిలిచింది. ఫాన్స్ భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
Also Read: IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్ ఘన విజయం! పాకిస్తాన్లా కాదు
92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు 36 మంది సారథులుగా వ్యవహరించారు. భారత జట్టుకు మొదటి టెస్ట్ కెప్టెన్ సీకే నాయుడు కాగా.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రతిఒక్కరూ జట్టుని ముందుండి నడిపించి ఎన్నో విజయాలను, మరెన్నో జ్ఞాపకాలనూ అందించారు. 92 ఏళ్లలో 314 మంది క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 1932 జూన్ 25న అమర్సింగ్ మొదటి టెస్ట్ క్యాప్ అందుకోగా.. 2024 మార్చి 7న దేవదత్ పడిక్కల్ చివరిసారిగా టోపీ అందుకున్నాడు. ఇన్నేళ్లలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండ్యూలర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, ఆర్ అశ్విన్, విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా లాంటి ఎందరో టెస్టుల్లో తనదైన ముద్ర వేశారు.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!