టీమిండియా జట్టు మళ్లీ వన్డేల్లతో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన గెలుపుతో టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది. ఇక, 115 పాయింట్లు ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ సెకండ్ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ లో చివరిదాకా పోరాడి ఓడిన ఆసీస్ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, టీమిండియా ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో నెంబర్-1 ప్లేస్ లో ఉంది.. తాజాగా ఆసీస్ పై విజయం సాధించడంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరుకుంది.
Read Also: Anasuya Bharadwaj: చీరకట్టులో అనసూయ సొబగులు చూశారా?
అయితే, ఈరోజు మొహాలీ స్టేడియంలో ఉత్కంఠంగా సాగిన పోరులో రాహుల్ సేన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతోచిత్తు చేసింది. దాంతో, ఈ స్టేడియంలో ఆసీస్పై 13 సంవత్సరాల తర్వాత తొలిసారి టీమిండియా గెలుపొందింది. ఇక, ఆసీస్ నిర్ధేశించిన 277 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభ్మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్(77 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు) శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యారు కేవలం 3 పరుగులకే రనౌట్ అయి.. పెవిలియన్ బాట పట్టాడు. దీంతో బరిలోకి దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్( 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో58 పరుగులు నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ ( 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 50 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గెలుపును అందించారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
Read Also: iPhone 15: ఐఫోన్ 15 కొనడానికి ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు..