Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Tdp Will Exist As Long As Telugu People Exist Says Chandrababu Naidu

Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

Published Date :April 29, 2026 , 11:28 am
By Sudhakar Ravula
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu: తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పార్టీ కార్యకర్తలే అసలు బలం అని పేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారని, ఎవరికీ తలవంచరని అన్నారు. నూతన కమిటీలను ఎన్నో వడపోతలు, వ్యూహాలతో ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ, కష్టపడి పనిచేసిన వారికి చోటు కల్పించేలా కమిటీలను రూపొందించామని చెప్పారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా విధానంగా మార్చుకున్నామని పేర్కొన్నారు.

Read Also: TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

Also Read

  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
  • Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
  • Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి

ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్‌చార్జికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించామని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా బిల్లుకు పూర్తిగా మద్దతు ఇచ్చామని చెప్పారు. చదువుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు చంద్రబాబు.. రామ్మోహన్ నాయుడు, శబరి, రాజేష్ వంటి యువ నాయకులను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని, ట్రైనింగ్ క్లాసులు నుంచి కార్యకర్తల సంక్షేమం వరకు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ కృషి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీకి రావడానికి లోకేష్ కృషే కారణమని పేర్కొన్నారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. అది పదవి కాదని, అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో టీడీపీ బలం పెరగాలని, 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే మరింత ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు. గతంలో కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలు తనకు గుర్తున్నాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర సహకారంతో గట్టెక్కిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని అన్నారు. నిలిచిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని, ప్రజలకు వాట్సాప్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్థలను తీసుకువచ్చి విశాఖపట్నాన్ని టెక్ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రత్యర్థి పార్టీపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నిధులు వస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు కలిగించడంలో ప్రత్యర్థి పార్టీ ముందుంటుందని విమర్శించారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కుట్రలకు ఇక కాలం చెల్లిందని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Politics
  • Chandrababu Amaravati speech
  • Chandrababu Naidu speech
  • Nara Lokesh TDP
  • TDP Committees

తాజావార్తలు

  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

  • MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..

  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

  • Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..

  • TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions