MLA Kolikapudi: మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి వీడియో వైరల్.. స్పందించిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వీడియో వైరల్ అవుతోంది. ఈ అంశంపై తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినట్లు జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్ళే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కూడా ప్రయాణం చేశారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని సార్ బాగున్నారా? అని అడిగానని తెలిపారు.. బాగున్నాను అని చెప్పి వారు వెళ్ళిపోవడం మొత్తం కలిసి 8 సెకండ్స్ లోపే జరిగిందని స్పష్టం చేశారు. తాను తిరుపతి పర్యటనలో ఉండగానే సీఎం కార్యాలయం నుంచి రావాలని కబురు అందిందన్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10.40వరకు సీఎం కార్యాలయంలోనే ఉన్నట్లు వెల్లడించారు. 40 నిమిషాల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయినట్లు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి అమరావతి నుంచి తిరువూరుకు వచ్చినట్లు చెప్పారు.
READ MORE: Pakistan: పాక్ మిస్సైల్ విఫలం.. సొంత ప్రజలపైనే కూలిన షాహీన్-3 క్షిపణి..
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
నిన్న, ఈరోజు తిరువూరులోని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వాస్తవానికి విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రిలో కలిసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారికి ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ దాని గురించి ఏమీ రావన్నారు. సంవత్సరం కాలం నుంచి దుష్ప్రచాలు చేసినవారికి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు.. కేవలం ఈ వీడియో ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే దాన్ని స్పష్టం చేసేందుకే మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ దుర్మార్గం ఏంటంటే బొత్స సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు వాటేసుకుని నవ్వుతూ మాట్లాడిన వీడియోలు బయకొచ్చాయి కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు.. వాస్తవాలను వక్రీకరించే వారికి నేను చెప్పేది ఒకటే.. మీరు ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినా కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసు. సీఎం చంద్రబాబు మూడు రోజుల క్రితం పిలిచి సంవత్సరకాలంలో ఎమ్మెల్యేగా తన పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది.. సీఎం చంద్రబాబు నా పనితీరును 66.4% మార్కులు ఇవ్వడం జరిగింది.. తిరువూరు నియోజకవర్గంలో అవినీతికి సంబంధించి 5.5% ఆరోపణలు ఉన్నట్లు ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా తెలిపారు.. నేను ఏం చేస్తున్నాను, ఎలా పనిచేస్తున్నాను,నాకు తెలుసు, నా తిరువూరు ప్రజలకు తెలుసు, సీఎం చంద్రబాబు కూడా తెలుసు.. ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను..” అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!