Yanamala Ramakrishnudu: సంక్షేమానికి కోత పెట్టారు. బడ్జెట్ లో కొత్తదనం ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థికమంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వం డీబీటీల విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటి.గతేడా డీబీటీ స్కీంల కోసం జరిపిన కేటాయింపుల కంటే రూ. 2 వేల కోట్ల మేర తక్కువగా ఖర్చు పెట్టారు.సంక్షేమ పథకాల్లో కోత విధించడం వల్లే కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు పెట్టారని అర్తమవుతోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీల నిమిత్తం రూ. 54 వేల కోట్లు కేటాయించారు.
Read Also: Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
Also Read
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
సంక్షేమానికి ఈ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే కేటాయిస్తోంది.రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులు 60 శాతం మేర ఉంటే అరకొర కేటాయింపులు ఏ మాత్రం సరిపోతుంది..?విద్య, వైద్యం వంటి రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు.ఫీజు రీ-ఇంబర్సుమెంట్ లోపభూయిష్టంగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి.. డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి.దీని వల్ల విద్య, వైద్య సేవలు అందక పేదలు ఇబ్బంది పడడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో కొత్తదనం లేదు.ఇప్పటి వరకు వైసీపీ నాలుగు బడ్జెట్టులు ప్రవేశ పెట్టినా ఎలాంటి అభివృద్ధి చూపడం లేదన్నారు యనమల.
Read Also: Today Stock Market Roundup 17-03-23: CEO రిజైన్.. TCS డౌన్..
పెట్టుబడి వ్యయం 10-15 శాతం మేరే ఖర్చు పెడుతున్నారు.మౌళిక వసతుల కల్పనకు నిధుల్లేవ్.గతేడాది పెట్టుబడి వ్యయం రూ. 33 వేల కోట్లు కేటాయిస్తే.. ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ. 16 వేల కోట్లుగా చూపుతున్నారు.కానీ పెట్టుబడి వ్యయం నిమిత్తం ఖర్చు పెట్టింది వాస్తవానికి రూ. 7 వేల కోట్లు మాత్రమేనని సమాచారం. నాలుగు బడ్జెట్టులు చూశాక ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే నమ్మకాన్ని కలిగించ లేకపోయిందని విమర్శించారు యనమల.
తెచ్చిన అప్పుడెక్కడికి వెళ్లింది.అప్పుల ద్వారా వచ్చిన నిధులను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.అప్పుల విషయాన్ని బడ్జెట్టులోనో.. బడ్జెట్ స్పీచులోనే చెప్పకుంటే ఎలా..?అన్ని రూపాలుగా చేసిన అప్పులెంత..? వాటికి కడుతోన్న వడ్డీలెంత..?రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్ధిక పరిస్థితుల్లోకి నెట్టారు.వచ్చే ఎన్నికల్లో జరిగేది సివిల్ వార్.2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 11 లక్షల కోట్ల మేరకు అప్పులు చేరతాయి.
కార్పోరేట్ బారోయింగ్స్ లెక్కలు బడ్జెట్టులో ఎందుకు చూపడం లేదు..?జీఎస్డీపీ గ్రోత్ పెరగకుంటే రెవెన్యూ జనరేషన్ జరగదు. అప్పులను ఉత్పాదక రంగాల్లో పెట్టాలి.. కానీ దాన్ని ఆ రంగాలకు కాకుండా వేరే రంగాలకు మళ్లించారు.ఎఫ్ఆర్బీఎం, బడ్జెట్ నింబధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోంది.బడ్జెట్ మాన్యువల్ ప్రకారం సంప్లిమెంటరీ గ్రాంట్స్ 10 శాతం మేర పెంచకూడదు.కానీ ఇష్టానుసారంగా అసెంబ్లీ ఆమోదం పొందకుండానే అధిక ఖర్చులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెవెన్యూ డెఫిసిట్ తగ్గిస్తే.. ఈ ప్రభుత్వం పెంచేస్తోంది.రెవెన్యూ డెఫిసిట్ తగ్గకుంటే ప్రజలపై భారం పడుతుంది.ఓపెన్ మార్కెట్టులో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెస్తున్నారు.ఓడీ, వేస్ అండ్ మీన్స్ లేని రోజంటూ లేదన్నారు యనమల.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!