TS Police: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై పోలీసుల నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది శృతికి మించి వివాదాలకు దారితీస్తోంది. లేని వాటిని ఉన్నట్లు, ఉన్నవాటిని లేనట్లు చిత్రీకరించి.. ఎదుటివారి భావోద్వేగాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతుండటంతో పార్టీల మధ్యే కాదు, సాధారణ ప్రజల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు తాండూరు పోలీసు శాఖ అధికారులు నజర్ పెట్టారు.
Read Also: Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ఇవాళ (బుధవారం) తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద పోస్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలపై నిఘా ఉంచినట్లు డీఎస్పీ పేర్కొన్నాడు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధికి వాడుకోవాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ చెప్పాడు. లేనిపోని వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వివాదాలకు, విఘాదాలకు కారణమయ్యే పోస్టులు పెడితే సుమోటోగా కేసును స్వీకరించి కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, వినియోగ దారులు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ సూచించారు.
Read Also: AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపులలో మీ ప్రాంతం అభివృద్ధి కోసం జరిగే చర్చలు ఉండాలని నియోజకవర్గంలో ఉన్న అన్ని వాట్సప్ గ్రూపులపై సోషల్ మీడియాపై తమ ప్రత్యేక దృష్టి ఉంచమని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పదజాలం వాడిన, పోస్టులు పెట్టిన తమకు ఫిర్యాదు చేయాలని లేకపోతే తామే సుమోటోగా స్వీకరించి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టిన కొందరు వ్యక్తులను కూడా బైండోవర్ చేయనున్నట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!