Tamilnadu : తమిళనాడులో అకాల భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన వైమానిక దళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : తమిళనాడులో ఆది, సోమవారాల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి సహా దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలు, రహదారులు పూర్తిగా నీట మునిగాయి. నది ప్రవహిస్తున్నట్లుగా వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. భారీ వర్షం కురిసింది, ప్రజలను ఆదుకునేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగాల్సి వచ్చింది. గత 24 గంటల్లో తమిళనాడులో డిసెంబర్ 18న కురిసిన భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో వరదలు సంభవించాయని భారత వైమానిక దళం సోమవారం ట్వీట్ చేసింది. IAF వేగంగా స్పందించింది. మానవతా సహాయం, రెస్క్యూ కార్యకలాపాల కోసం సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను మోహరించింది. ప్రస్తుతం వైమానిక దళం తన Mi-17 V5 హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను నిర్వహిస్తోంది.
Read Also:Nizamabad: వరుస హత్యల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు..
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
వరదల్లో చిక్కుకున్న 7,500 మందిని సురక్షితంగా తరలించినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు. వరద బాధితులను 84 సహాయ శిబిరాల్లో ఉంచారు. ‘కామన్ అలర్ట్ ప్రోటోకాల్’ ద్వారా SMS ద్వారా సుమారు 62 లక్షల మందికి హెచ్చరిక పంపబడింది. అకాల వర్షాలకు సంబంధించి.. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్లు తాళ్ల సహాయంతో బయటకు తీసి సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నాయి. భారీ వర్షాల కారణంగా శ్రీ వైకుండంలో రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. ట్రాక్ల మధ్య ఉన్న కంకర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి, పట్టాలు గాలికి వేలాడుతూ ఉన్నాయి.
Read Also:Nizamabad: వరుస హత్యల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు..
తూత్తుకుడిలోని తిరునల్వేలిలో చాలా చోట్ల నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తోందంటే వర్షపాతం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. కోవిల్పట్టి సహా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. తామిరబరణిలో అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. దక్షిణ తమిళనాడులోని 39 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. తూత్తుకుడి, తిరునెల్వేలి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. డిసెంబర్ 19న కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాసి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!