Bomb Threat : విమానానికి బాంబు బెదిరింపు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
- విమానాశ్రయంలో భద్రతను పెంచిన పోలీసులు
- నిందితుడిని అరెస్ట్ చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశంలోని 41 విమానాశ్రయాలకు ఈమెయిల్ ద్వారా ఇలాంటి తప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి. జూన్ 18న ఇండిగో ఎయిర్లైన్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్ చాట్లో ఒక వ్యక్తి చెన్నై నుండి ముంబైకి వెళ్లే విమానంలో బాంబు పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో భద్రతను పెంచారు.. దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే దర్యాప్తులో ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు.
Read Also:Health Tips : పెప్పర్ రైస్ ను తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి…
Also Read
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
విమానంలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి తమిళనాడు వాసి, తంజావూరు జిల్లా తిరువయ్యారు నివాసి. తప్పుడు బాంబు బెదిరింపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని 27 ఏళ్ల వి ప్రసన్నగా గుర్తించారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బృందం ప్రసన్నను అరెస్ట్ చేసింది. చెన్నై-ముంబై విమానంలో బాంబు పెట్టినట్లు కస్టమర్ సర్వీస్ సెంటర్ చాట్లో ప్రసన్న పేర్కొన్నాడు.
Read Also:Legal Notices: మంత్రి పొన్నంపై ఆరోపణలు.. పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు..
అదే రోజు అంటే జూన్ 18న దేశవ్యాప్తంగా ఉన్న మరో 41 విమానాశ్రయాల్లో ఈమెయిల్ ద్వారా ఇలాంటి తప్పుడు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అన్ని విమానాశ్రయాలను తనిఖీ చేసి భద్రతను పెంచారు. విచారణలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నకిలీ బాంబు బెదిరింపులు చేసే వారిపై 5 సంవత్సరాల ఫ్లయింగ్ నిషేధాన్ని విధించాలని ప్రతిపాదించింది. ఎందుకంటే ఇటువంటి తప్పుడు బెదిరింపులు విమాన సమయంలో చాలా సమస్యలను కలిగిస్తాయి. ఈ కేసులో సైబర్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు నమోదు చేయగా ప్రసన్నను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!