Site icon NTV Telugu

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ అంబాసిడ‌ర్‌గా స్టార్ అథ్లెట్..

Ussain Bolt

Ussain Bolt

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన అనేక ప్రచారాలను చేస్తుంది ఐసీసీ.

Also read: MS Dhoni Alert: ధోని బ‌స్సు ఎక్కడానికి రూ.600 కావాల‌ట‌.. పోస్ట్ వైరల్..

ఈ నేపథ్యంలో తాజాగా ఐసీసీ ఓ ప్రపంచ పేరుగాంచిన స్టార్ అథ్లెట్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. 8సార్లు ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేత, జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్‌ ను టీ20 ప్రపంచ కప్ అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది. ఈ సందర్భంగా ఉసెన్ బోల్ట్‌ మాట్లాడుతూ.. తాను ఈ ప్రపంచ కప్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతూ.. వరల్డ్ కప్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Also read: IPL: ఢిల్లీ యువ ఫేసర్ రసీఖ్ సలాంకు బీసీసీఐ మందలింపు

ఇకపోతే జరగబోయే టి20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇప్పటికే 20 దేశాలు అర్హత పొందాయి. వీటిని మొత్తం 4 గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి గ్రూప్ లో 5 టీంలు ఉండగా.. ప్రతి టీం మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. అలా నాలుగు మ్యాచ్ లు ఆడిన తర్వాత ప్రతి గ్రూపులో ఉన్న టాప్ 8 లో నిలిచిన జట్లు సూపర్-8 కి అర్హత సాధిస్తాయి. ఇక్కడ సూపర్-8 దశలో ప్రతి టీం ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడతాయి. అందులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక చివరిగా జూన్ 29న ఫైనల్ మ్యాచ్ బార్బోడస్ వేదికగా జరగనుంది.

Exit mobile version