Solar Plant: దేశంలోనే రెండవ అతిపెద్ద సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Plant: దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను కర్ణాటకలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం సోలార్ ఎనర్జీ సంస్థ స్వాన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుని భూమిని సమకూర్చింది. ఈ డీల్ తర్వాత కంపెనీ షేర్లకు రెక్కలు వచ్చాయి. వారం చివరి ట్రేడింగ్ రోజున కంపెనీ షేరు 2.30 శాతం లాభంతో ముగిసింది. కంపెనీ షేర్లు రాబోయే మూడేళ్లలో బూమ్ను చూడవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మల్టీబ్యాగర్ పెట్టుబడిదారులకు షేర్ల రూపంలో సుమారు 1800 శాతం రాబడిని ఇవ్వగలదని భావిస్తున్నారు. గత ఒక నెలలో కంపెనీ షేర్లు 11 శాతానికి పైగా లాభపడ్డాయి. అదే సమయంలో కంపెనీ స్టాక్ 3 నెలల్లో 32 శాతం పెరిగింది.
రాబోయే మూడేళ్లలో కంపెనీ షేర్లలో పెద్ద బూమ్ కనిపిస్తుంది. కంపెనీ స్టాక్ రూ.5000 స్థాయిలో అంటే ప్రస్తుత రేటుతో పోలిస్తే దాదాపు 1800 శాతం రాబడిని ఇవ్వగలదు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ రూ.7,111.24 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ సౌరశక్తిలో మాత్రమే కాకుండా పెట్రోకెమికల్, రక్షణ రంగాలలో కూడా పనిచేస్తుంది. ఇదే కంపెనీ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ను కూడా కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరిలో డీల్ పూర్తయింది.
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
Read Also:Adani Ports: మేనేజ్మెంట్తో విభేదాలు.. అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా
దేశంలో రెండవ అతిపెద్ద సోలార్ ప్లాంట్
స్వాన్ ఎనర్జీ దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ సోలార్ ప్లాంట్ కర్ణాటకలో నిర్మించనున్నారు. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీకి భూమిని సమకూర్చింది. ఈ ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ ప్లాంట్ను పూర్తి చేసి, ప్రారంభించిన తర్వాత, దేశంలో విద్యుత్ కొరతను తీర్చడంలో స్వాన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సహాయపడుతుంది. ప్లాంట్ త్వరలో పూర్తి కానుంది. ఆ తర్వాత కంపెనీ విద్యుత్ ఉత్పత్తి పనులు కూడా ప్రారంభమవుతాయి. అదే సమయంలో సామాన్య ప్రజలు కూడా తక్కువ ధరకే విద్యుత్ను పొందగలుగుతారు.
జరుగుతున్న ఎన్ఎల్జి ప్రాజెక్టు పనులు
మరోవైపు, ఎల్ఎన్జి రంగంలో స్వాన్ ఎనర్జీకి చాలా ఆధిపత్యం ఉంది. మరోవైపు 10ఎంఎంటీపీఏ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యంతో గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో జాఫ్రాబాద్ తీరంలో ఉన్న స్వాన్ ఎన్ఎల్జి టెర్మినల్ నిర్మించబడింది. ఇది ఇంధన డిమాండ్ను తీర్చడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. మరోవైపు, ఎల్ఎన్జి రిసెప్షన్, స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఫ్లోటింగ్, స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్లను (ఎఫ్ఎస్ఆర్యు) కలిగి ఉన్న ఎల్ఎన్జి పోర్ట్ సదుపాయం నిర్మాణంలో కంపెనీ నిమగ్నమై ఉంది.
Read Also:Tomato Rates: ఏపీలో భారీగా తగ్గిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే..!
తాజావార్తలు
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!